క్రికెట్ అంటేనే శారీరక శ్రమతో కూడుకుని ఉన్న ఆట. ఈ ఆటకు ముఖ్యంగా కావాల్సింది బాడీ ఫిట్ నెస్. అందుకే క్రికెట్ ఆటగాళ్లు ఫిట్ నెస్ పై ఎక్కువగా దృష్టి పెడుతుంటారు. ఆటగాడు ఎంత ఫిట్ గా ఉంటే.. మైదానంలో అంత వేగంగా కదులుతాడు. ఇక భారీకాయుల అవస్థలను మనం క్రికెట్ లో చూస్తూనే ఉంటాం. వికెట్ల మధ్య పరిగెత్తలేక.. ఫీల్డింగ్ చేయలేక తెగ ఇబ్బంది పడుతుంటారు. ఇక మైదానంలో ఎక్కువగా చురుగ్గా కదిలేది వికెట్ కీపరే. మరి ఇంతలా కదిలే వికెట్ కీపరే ఫిట్ లో లేకపోతే.. జట్టుకు చాలా ఇబ్బంది. ప్రస్తుతం ధోని, రిషబ్ పంత్ కు సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది.
మహేంద్ర సింగ్ ధోని.. వికెట్ల మధ్యలోనే కాదు.. వికెట్ల వెనకాల కూడా చిరుతలా పరిగెడుతూ బ్యాట్స్ మెన్ లను పెవిలియన్ కు పంపిస్తుంటాడు. ధోని అంత వేగంగా కదలడానికి అతడి ఫిట్ నెసే కారణం. జట్టులో అత్యంత చురుగ్గా ఉండాల్సింది కూడా వికెట్ కీపరే. మరి అలాంటి వికెట్ కీపర్ బద్దకంగా ఉంటే.. జట్టు భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు. ప్రస్తుతం టీమిండియా వికెట్ కీపర్లుగా దినేష్ కార్తీక్, రిషబ్ పంత్ లు వ్యవహరిస్తున్నారు. అయితే దినేష్ కార్తీక్ మెరుపు కీపింగ్ చేస్తూ.. డైవ్ లు చేయడం మనకు తెసిందే. ఇక వచ్చిన సమస్యల్లా రిషబ్ పంత్ ఒక్కడే. అతడి ఫిట్ నెస్ చూస్తే.. అసలు ఇతడు ఫ్రొఫెషనల్ క్రికెటరేనా అనే అనుమానం వస్తుంది. అలా ఉంటుంది అతడి బాడీ. అయితే ఒక వ్యక్తిగా బలమైన శరీరంల ఉండటంలో తప్పులేదు. కానీ క్రికెట్ లాంటి ఆటలోకి వచ్చే సరికి శరీరం దృఢంగా ఉండటం చాలా అవసరం.
అయితే బాడీ కొవ్వుతో నిండిపోయి స్థూలకాయులగా మారితే.. గ్రౌండ్ లో ఆయాసం వస్తుందే తప్ప రన్స్ రావు. అందుకే క్రీడాకారుల ఫిట్ నెస్ పై అంతగా దృష్టి పెడతారు. పంత్ సైతం గతంలో ఫిట్ నెస్ పై బాగానే దృష్టి పెట్టాడు. తన ఆహారపు అలవాట్లను మార్చుకుని బరువు కూడా తగ్గాడు. ఈ క్రమంలోనే ఇదే పద్దతిని పంత్ కంటిన్యూ చేయడంలేదు. దాంతో మళ్లీ బరువు పెరిగాడు ప్రస్తుతం పంత్ బొద్దుగా మారిన ఫొటో వైరల్ గా మారింది. దాంతో ధోనితో పోల్చుతూ.. నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. పంత్ అసలుకే విఫలం అవుతూ.. విమర్శల పాలవుతున్నావ్.. ఇప్పటికైన జర ఫిట్ నెస్ పై దృష్టి పెట్టరాదు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ధోని 41 సంవత్సరాల వయసులో ఎలా ఉన్నాడు. 25 సంత్సరాల వయసులో నువ్వెలా ఉన్నావ్ చూసుకో పంత్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.