2019 ప్రపంచ కప్ లో రాయుడికి స్థానం దక్కలేదు. అంతటితో బ్యాడ్ లక్ అని సరిపెట్టుకున్నా.. శిఖర్ ధావన్ గాయపడడంతో ఒక బ్యాటర్ ప్లేస్ లో విజయ్ శంకర్ ని సెలెక్ట్ చేశారు. దీంతో తెలుగోడి అన్యాయం జరిగిందని అందరూ బాధపడ్డారు. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం తెలుగు వికెట్ కీపర్ అయినటువంటి భరత్ కి డబ్ల్యూటీసీ ఫైనల్లో చోటు దక్కడం లేదని తెలుస్తుంది.
ఇంగ్లాండ్ వేదికగా లండన్ లోని ఓవల్ మైదానంలో ఈ నెల 7 న డబ్ల్యూటీసీ ఫైనల్ జరగబోతుంది. టీమిండియాకి వరుసగా ఇది రెండో డబ్ల్యూటీసీ ఫైనల్ కావడం విశేషం. తొలిసారి ఆడిన ఈ ఫైనల్ లో న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలవ్వగా.. ఈ సారి ఈ ట్రోఫీ గెలవడానికి పటిష్టమైన ఆస్ట్రేలియా ఓడించాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో భారత్ ఈ ఫైనల్ గెలవాలంటే శక్తికి మించిన పనే. ఇందులో భాగంగా ప్రధానంగా ప్లేయింగ్ 11 ని ఎంచుకోవాల్సి అవసరం ఎంతైనా ఉంది. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పుడు టీమిండియా ఫైనల్లో ఆడబోయే ప్లేయింగ్ 11లో వికెట్ కీపర్ గా ఇషాన్ కిషాన్ కి ఛాన్స్ ఇవ్వనున్నారని తెలుస్తుంది. తెలుగోడు అయినందుకేనా భరత్ ని ఇప్పుడు పక్కనపెడుతున్నారనే టాక్ వినిపిస్తుంది.
2019 ప్రపంచ కప్ అద్భుతమైన ఫామ్ లో ఉన్న రాయుడుకి 15 మంది ప్రాబబుల్స్ లో చోటు లభించలేదు. దీంతో చాలా మంది క్రికెట్ విశ్లేషకులు రాయుడిని ఎందుకు సెలెక్ట్ చేయలేదని విమర్శలు గుప్పించారు. దీంతో రాయుడు కూడా దురదృష్టం అనుకోని సరిపెట్టుకున్నాడు. అయితే శిఖర్ ధావన్ కి గాయమైన తర్వాత ఒక బ్యాటర్ ప్లేస్ లో విజయ్ శంకర్ ని ఎంపిక చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. శిఖర్ కి గాయంతో రాయుడు ప్లేస్ కన్ఫర్మ్ అనుకున్నారంతా. కానీ అనుకున్నట్లుగా జరగలేదు. దీంతో బాధను భరించలేకపోయిన రాయుడు ఏకంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. రాయుడు తీసుకున్న ఈ నిర్ణయం అప్పటిలో సగటు క్రికెట్ అభిమానికి బాధను కలిగించింది. అయితే ఇప్పుడు అలాంటి తెలుగు కుర్రాడికి వరల్డ్ ఛాంపియన్ షిప్ లో ఫైనల్ కి పక్కనపెడుతున్నట్లుగా సమాచారం.
మంచి ఫామ్ లో ఉన్న భరత్ కి ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ తరపున ఒక్క మ్యాచ్ ఆడేందుకు అవకాశం కల్పించలేదు. ప్లే ఆఫ్ బెర్త్ కంఫర్మ్ చేసుకున్న తర్వాత కూడా భరత్ కి తుది జట్టులో అదే తీసుకోలేదు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు టీమిండియా ఆడబోయే ఫైనల్ లో అవకాశం కలిపించకపోతే తెలుగు వారికీ భారత్ క్రికెట్ బోర్డు అన్యాయం చేసినట్లే. బోర్డర్-గవాస్కర్ ట్రోఫిలో భాగంగా తలిసారి టెస్టు జట్టులో అవకాశం దక్కించుకున్న భరత్ ఈ సిరీస్లో నిరాశ పరిచాడు. అయితే పిచ్ కారణంగా ఈ సిరీస్ లో ఎవరూ రాణించలేదనే సంగతి గుర్తుంచుకోవాలి. ముంబై ఇండియన్స్ జట్టుకి కెప్టెన్ గా ఉంటున్న రోహిత్ శర్మ.. ప్రస్తుతం భారత జట్టు కెప్టెన్ కూడా. ఈ నేపథ్యంలో కిషన్ కి రోహిత్ అవకాశం ఇస్తాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి ఈ ఫైనల్లో భరత్ కి అవకాశం రాకపోతే రాయుడిలాగే భరత్ కి అన్యాయం చేసి తెలుగు క్రికెటర్ల మీద వివక్ష చూపిస్తున్నట్టే. మరి రోహిత్ ఎవరి వైపు మొగ్గు చూపిస్తాడో తెలియాలంటే జూన్ 7 వరకు ఆగాల్సిందే. ఈ విషయంలో మీ భిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.