భారత దిగ్గజ క్రికెటర్ ఝులన్ గోస్వామి రికార్డుల మోత మోగిస్తుంది. ప్రస్తుతం న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ 2022 తర్వాత గోస్వామి క్రికెట్కు వీడ్కోలు పలికే అవకాశం ఉంది. అయినా కూడా అద్భుత ఫామ్తో చెలరేగుతోంది. ఇప్పటికే ప్రపంచకప్లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా చరిత్ర సృష్టించిన గోస్వామి.. తాజాగా మరో అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకుంది.
శనివారం ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్తో వన్డేల్లో 200 మ్యాచ్లు పూర్తి చేసి రికార్డు సృష్టించింది. దీంతో ప్రపంచంలోనే మొదటి మహిళా బౌలర్గా అవతరించింది. అంతే కాదు 200 వన్డేలు ఆడిన రెండో మహిళా క్రికెటర్గా ఝులన్ నిలిచింది. అంతకంటే ముందు ఈ ఘనత టీమిండియా లెజెండరీ కెప్టెన్ మిథాలీ రాజ్ పేరిట ఉంది. మిథాలీ 229 మ్యాచ్లు ఆడింది. మరి ఝులన్ 200 వన్డేలు పూర్తి చేసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: వీరేంద్ర సెహ్వాగ్ పై షోయబ్ అక్తర్ షాకింగ్ కామెంట్స్!
That special moment, Jhulan Goswami who completes 200 ODI matches today is congratulated by Mithali Raj 😍#CWC22 #MithaliRaj 📸Disney+Hotstar pic.twitter.com/elqBYRJ40i
— Female Cricket #CWC22 (@imfemalecricket) March 19, 2022
200 ODIs for this legend 🐐
Another day, another milestone for Jhulan Goswami. An icon 🙌 #CWC22 #INDvAUS pic.twitter.com/FT2bcU7mBo
— ESPNcricinfo (@ESPNcricinfo) March 19, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.