మన అమ్మాయిలు అదరగొట్టారు. ఇంగ్లాండ్ జట్టుని వారి గడ్డపైనే ఓడించారు. వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ చేశారు. మరి సిరీస్ గెలుచుకున్నారు కాబట్టి ఫుట్ హ్యాపీనెస్. గ్రౌండ్ లో అయితే ఆ ఆనందాన్ని కంట్రోల్ చేసుకుంటారు గానీ బయట మాత్రం సంతోషాన్ని ఆపుకోలేకపోయారు. పట్టరానీ ఆనందంతో ఎయిర్ పోర్టులోనే గంతులేశారు. అసలు వీళ్లు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. మోడల్స్ లా నడుస్తూ, అందరూ కలిసి పాటలకు స్టెప్పులేస్తూ కనిపించారు. అందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. 2023 మహిళా ప్రపంచకప్ కంటే ముందు టీమిండియా జట్టు ఇంగ్లాండ్ అద్భుతమైన విజయం సాధించింది. తాజాగా జరిగిన మూడు వన్డేల సిరీస్ ని క్లీన్ స్వీప్ చేసింది. వీటి గురించి పక్కనబెడితే.. చివరి వన్డేలో మన బౌలర్ దీప్తిశర్మ చేసిన మన్కడింగ్.. హాట్ టాపిక్ అయింది. ప్రస్తుత, మాజీ క్రికెటర్లు దీని గురించి తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. చివరకు బౌలర్ దీప్తిశర్మతోపాటు బ్యాటర్ చార్లీ డీన్ కూడా ఎవరికి వారు వివరణ ఇచ్చారు. దీంతో ఈ వివాదం కాస్త సద్దుమణిగింది.
ఇక అంతా అయిపోయింది కాబట్టి.. భారత మహిళలు స్వదేశానికి వచ్చేశారు. గెలిచిన ఆనందాన్ని డ్రస్సింగ్ రూమ్ నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్న వీళ్లు.. ఎయిర్ పోర్ట్ కి వచ్చినా సరే దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయారు. పీపీఐ కిట్లు వేసుకున్నా సరే.. మోడల్స్ లా నడుస్తూ, డ్యాన్సులు వేస్తూ తెగ ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోని జెమీమా రోడ్రిగ్స్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. భారత సీనియర్ బౌలర్ జులాన్ గోస్వామికి ఇంగ్లాండ్ తో సిరీసే చివరిది. ఈ సిరీస్ గెలిచిన మన జట్టు.. ఆమెకి గ్రాండ్ గా వీడ్కోలు పలికారు. మరి మన మహిళా క్రికెటర్లు ఆనందం, ఆ సంతోష సమయంలో డ్యాన్స్ చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
i’ve never loved a team more😭
from @JemiRodrigues Instagram post pic.twitter.com/qE5ZsgXFeB
— s (@_sectumsempra18) September 26, 2022
ఇదీ చదవండి: మన్కడింగ్ వివాదం: మధ్యలో దూరి అతి చేస్తున్న పాకిస్థాన్ ఫ్యాన్స్!