గత కొంతకాలంగా టీమిండియా స్టార్ ప్లేయర్లు గాయాలతో బాధపడుతునున్న సంగతి తెలిసిందే. రిషబ్ పంత్, బూమ్రా, శ్రేయాస్ అయ్యర్, కె యల్ రాహుల్ లాంటి స్టార్ ప్లేయర్లు ఈ లిస్టులో ఉన్నారు. అయితే తాజా సమాచార ప్రకారం ఆసియా కప్ ఇద్దరు స్టార్లు ఆడనున్నట్లుగా సమాచారం.
2023 టీమిండియాకు చాలా కీలకంగా మారింది. ఆసియా కప్ తో పాటుగా స్వదేశంలో జరిగే వన్డే వరల్డ్ కప్ కూడా ఆడాల్సి ఉంది. గతేడాది ఆసియా కప్ లో భారత్ కనీసం ఫైనల్ కు కూడా వెళ్లలేకపోయింది. అంతేకాదు గత పదేళ్లుగా ఐసీసీ టోర్నీ టీమిండియాకి అందని ద్రాక్షాగానే మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో ఈ టోర్నీలు ఎలాగైనా గెలవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ముఖ్యంగా స్వదేశంలో జరిగే వన్డే వరల్డ్ కప్ గెలుచుకోవడానికి టీమిండియాకు ఇదొక చక్కటి అవకాశం. అయితే గత కొంత కాలంగా స్టార్ ప్లేయర్ల గాయాలు మన జట్టుని వేధిస్తున్నాయి. తాజా సమాచార ప్రకారం భారత స్టార్ క్రికెటర్లు బుమ్రా, రాహుల్ కోలుకున్నట్లుగా సమాచారం అందింది.
రిషబ్ పంత్, బూమ్రా, శ్రేయాస్ అయ్యర్, కె యల్ రాహుల్ గత కొన్ని సంవత్సరాలుగా టీంఇండియాలో కీలక ప్లేయర్లు. ఫార్మాట్ ఏదైనా ఈ నలుగురు టీంఇండియాలో రెగ్యులర్ సభ్యులు.అయితే వీరు నలుగురు ఒకేసారి గాయపడడం జట్టుపై గట్టిగానే ప్రభావం చూపింది. ముఖ్యంగా డబ్ల్యూటీసీ ఫైనల్లోవీరు లేని లోటు స్పష్టంగా తెలిసింది. ఇక వీరు వరల్డ్ కప్ సమయానికైనా ఆడతారా లేదా అనుకుంటున్నా సమయంలో ఒక గుడ్ న్యూస్ అందింది. బుమ్రా, రాహుల్ త్వరగా కోలుకొని ఆసియా కప్ లో ఆడే అవకాశలు పుష్కలంగా ఉన్నాయని తెలుస్తుంది.
ప్రస్తుతం బెంగళూరులోని ఎన్సీఏ టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్లు కోలుకుంటున్నారు. ఐపీఎల్ లో ఫీల్డింగ్ చేస్తూ తొడ గాయంతో మధ్యలోనే వైదొలిగిన రాహుల్ కోలుకున్నట్లుగా సమాచారం. ఇక బూమ్రా ఇటీవలే నెట్స్ లో వరుసగా 7 ఓవర్లు వేసి ఫిట్ గా ఉన్నానని తెలియజేశాడు. వచ్చే నెలలో బుమ్రా కొన్ని ప్రాక్టీస్ మ్యాచులు ఆడతాడని, ఆ తర్వాతనే ఫిట్నెస్పై ఒక అంచనాకు వస్తారని తెలుస్తోంది. వీరిద్దరి గాయాల విషయంలో ఎలాంటి ఆందోళన లేకపోయినా.. అయ్యర్ పరిస్థితిపై మాత్రం క్లారిటీ రాలేదు. ఒకవేళ అయ్యర్ వరల్డ్ కప్ సమయానికి కోలుకోలేకపోతే డైరెక్ట్ గా వరల్డ్ కప్ ఆడిస్తే మళ్ళీ గాయం తిరగపెట్టే అవకాశలు ఉన్నాయి. మొత్తానికి బుమ్రా,రాహుల్ త్వరలో జట్టులోకి చేరబోతున్నారని తెలుస్తుంది. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.