ఏ రంగంలో అయినా సరే గెలవాలని అందరూ చూస్తారు. దానికోసం రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఇక క్రికెట్ లో అయితే గెలవడం కోసం ఏదైనా చేసేందుకు క్రికెటర్లు రెడీ అయిపోతారు. స్లెడ్జింగ్ నుంచి మన్కడింగ్ వరకు ఇలా క్రికెట్ లో చాలా జరుగుతుంటాయి. అయితే ఇప్పుడు జరిగింది మాత్రం క్రికెట్ లో కాస్త డిఫరెంట్. జింబాబ్వే-వెస్టిండీస్ టెస్టు సిరీస్ లో ఈ సంఘటన జరిగింది. విండీస్ స్టార్ ఆల్ రౌండర్ హోల్డర్ చేసింది చూసి అందరూ షాకయ్యారు. ఇలా కూడా చేస్తారా అని మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే?
ఇక వివరాల్లోకి వెళ్తే.. తాజాగా వెస్టిండీస్-జింబాబ్వే మధ్య టెస్టు జరిగింది. ఈ మ్యాచులో అద్భుతమైన గేమ్ తో రెండుజట్లు ఆకట్టుకున్నాయి. మరీ ముఖ్యంగా చంద్రపాల్ కొడుకు తేజరిన్ చంద్రపాల్ అజేయ డబుల్ సెంచరీతో అదరగొట్టేశాడు. ఇక జింబాబ్వే ప్లేయర్లు కూడా తమ బ్యాటింగ్ తో అదరగొట్టేశారు. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసినప్పటికీ.. విండీస్ జట్టు గెలుపు కోసం చాలా గట్టిగా ట్రై చేసింది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ జేసన్ హోల్డర్ అయితే ఇంకాస్త కొత్తగా ప్రయత్నించాడు. ఐదో రోజు ఆటలో పిచ్ నుంచి స్పిన్నర్లకు సహకారం అందుతుందని తెలిసి తానే స్పిన్నర్ అవతారం ఎత్తాడు. సాధారణంగా మీడియం పేస్ బౌలింగ్ వేసే హోల్డర్.. ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేశాడు. వికెట్లేమి తీయకపోయినప్పటికీ.. తను స్పిన్ వేసిన రెండు ఓవర్లలో కేవలం ఆరు పరుగులే ఇచ్చాడు. ఈ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇదిలా ఉండగా ఈ టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టులో తేజనరైన్ చంద్రపాల్ డబుల్ సెంచరీ చేశాడు. దీంతో 447/6 భారీ స్కోరు వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం జింబాబ్వే తన తొలి ఇన్నింగ్స్ లో 379/9 రన్స్ వద్ద డిక్లేర్ ఇచ్చింది. రెండో ఇన్నింగ్స్ లో విండీస్ జట్టు 203/5 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ ప్రకటించి.. ప్రత్యర్థి జట్టుకు మంచి టార్గెట్ ఫిక్స్ చేసింది. దీంతో మ్యాచుని డ్రా చేసుకునేందుకు జింబాబ్వే చాలా గట్టిగా ప్రయత్నించి సక్సెస్ అయింది. ఐదోరోజు గేమ్ ముగిసేసరికి 134/6తో నిలిచి మ్యాచ్ ని డ్రా చేసుకుంది. ఇక విండీస్ పేసర్.. ఏకంగా స్పిన్ వేయడం చూసిన నెటిజన్స్.. పాపం ఇంత చేసినా సరే గెలవలేకపోయారే అని కామెంట్స్ పెడుతున్నారు. మరి విజయం కోసం పేసర్, స్పిన్ బౌలింగ్ వేయడంపై మీరేం అనుకుంటున్నారు. ఇలాంటిది ఇంతకు ముందెప్పుడైనా చూస్తే కింద కామెంట్ చేయండి.