సచిన్ టెండూల్కుర్.. ఎంతో అద్భుతమైన బ్యాటింగ్తో ఇండియన్ క్రికెట్ గాడ్ పేరొందిన దిగ్గజ ఆటగాడు. తన అసాధారణ ఆటతో టీమిండియాకు ఒంటిచేత్తో ఎన్నో విజయాలు అందించిన గొప్ప క్రికెటర్. అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన తర్వాత ఐపీఎల్లో తాను ప్రాతినిథ్యం వహించిన ముంబై ఇండియన్స్కు మెంటర్గా ఉన్నాడు. ఈ టోర్నీ పుణ్యామాని ముంబై ఇండియన్స్లోని యువ క్రికెటర్లకు సచిన్ లాంటి దిగ్గజాల సలహాలు దొరుకుతున్నాయి.
అలాగే చాలా మంది దిగ్గజ క్రికెటర్లు మళ్లీ మైదానంలో కలుసుకునే అవకాశం దొరుకుతుంది. ఒక తరం క్రికెటర్లు కలుసుకుని వారి పూర్వ పరిస్థితులు, ఆనాటి మధుర క్షణాలను గుర్తుచేసుకుంటూ ఉంటారు. ఐపీఎల్ 2022లో బుధవారం ముంబై ఇండియన్స్, పంజాబ్ మ్యాచ్ సందర్భంగా సచిన్ టెండూల్కర్, పంజాబ్ ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ కూడా కలుసుకున్నారు. కానీ.. ఆశ్చర్యకరంగా జాంటీ రోడ్స్ ముంబై ఇండియన్స్ ప్లేయర్స్తో కలుసుకునేటప్పుడు సచిన్ టెండూల్కుర్ రాగానే.. కాళ్లు మొక్కాడు. ఊహించని ఈ సంఘటనతో షాక్ తిన్న సచిన్.. రోడ్స్ను ఆపే ప్రయత్నం చేశాడు.. కానీ రోడ్స్ తాను అనుకున్నది మాత్రం చేసేశాడు. సచిన్కు పాదాభివందనం చేశాడు. రోడ్స్ సచిన్కు పాదాభివందనం చేసే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
గతంలో యువరాజ్ సింగ్ కూడా గ్రౌండ్లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలోనే సచిన్కు పాదాభివందనం చేశాడు. ఇప్పుడు రోడ్స్ కూడా అలాంటి సీన్ రిపీట్ చేయడం విశేషం. కాగా సచిన్, రోడ్స్ దాదాపు ఒకే తరం క్రికెటర్లు అయినా కూడా సచిన్ అంటే జాంటీ రోడ్స్ ఎంతో గౌరవం. అందుకే తను ఇలా చేసి ఉంటాడని క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: రషీద్ ఖాన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన SRH కోచ్ ముత్తయ్య మురళీథరన్
i missed this last night why is he like this😭 pic.twitter.com/AnlnoyZgOp
— m. (@idyyllliic) April 14, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.