భారత్, వెస్టిండీస్ ల మధ్య నేడు తొలి వన్డే జరగనుంది. బార్బడోస్ వేదికగా జరగబోయే ఈ వన్డే మ్యాచ్ చూడడానికి అభిమానులు ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడో ఇప్పుడు చూద్దాం.
వెస్టిండీస్ తో టెస్టు సిరీస్ ని విజయవంతంగా ముగించుకున్న టీమిండియా ఇక మీద నుంచి పరిమిత ఓవర్ల క్రికెట్ మీద దృష్టి పెట్టనుంది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా విండీస్ నేడు జరగబోయే తొలి వన్డేకి సిద్ధమవుతుంది. బలహీనంగా ఉన్న ఉన్న విండీస్ జట్టుని తేలికగా తీసుకుంటే అసలుకే ప్రమాదం వస్తుంది. హోప్ తో కూడిన విండీస్ జట్టు స్వదేశంలో గట్టి పోటీ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పైగా ఈ ఏడాది వరల్డ్ కప్ జరగనుండడంతో సీనియర్లు ఇకపై జరిగే ప్రతి వన్డే మ్యాచులో బరిలోకి దిగబోతున్నారు. కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి స్టార్లు ఈ మ్యాచ్ ఆడుతుండడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ టెలికాస్ట్ కాబోతుందో ఇప్పుడు చూద్దాం.
సాధారణంగా భారత్ లో మ్యాచ్ జరిగితే స్టార్ స్పోర్ట్స్ లో ప్రాసారమవుతుంది. ఈ విషయంలో అభిమానులకి పెద్దగా సమస్య లేదు. కానీ టీమిండియా విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు మాత్రం ఏ ఛానెల్ లో లైవ్ టెలికాస్ట్ అవుతుందో ఫ్యాన్స్ తలలు బాదుకుంటారు. ప్రస్తుతం విండీస్ పర్యటనలో టెస్టు మ్యాచులు చూసుకుంటే సోనీ సిక్స్, స్టార్ స్పోర్ట్స్ ఛానల్ లు ప్రసారం చేయకపోవడంతో ఈసారి దూరదర్శన్ లో ఈ మ్యాచ్ చూసే అవకాశం కలిగింది. ఇక తాజాగా విండీస్ తో జరగనున్న వన్డే సిరీస్ కూడా దూరదర్శన్ లో లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు. ఇక ఓటీటీలో జియో సినిమాలో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. జియో సినిమా హిందీ, ఇంగ్లీష్ కామెంట్రీ అందిస్తుండగా.. దూరదర్శన్ మాత్రం బెంగాలి, తెలుగు, కన్నడ, తమిళ్, భోజ్పురి భాషల్లో వ్యాఖ్యానం అందించేందుకు సిద్దమైంది. డీడీ స్పోర్ట్స్ చానెల్లో హిందీ, ఇంగ్లీష్ కామెంట్రీ రానుండగా.. డీడీ సప్తగిరి, డీడీ యాదగిరి చానెల్స్లో తెలుగు కామెంట్రీ రానుంది.