బెంగళూరు వేదికగా ఇటీవలే సాఫ్ టోర్నీ ఆరంభమైన సంగతి తెలిసిందే. అయితే భారత ఫుట్ బాల్ టీం వరుసగా మ్యాచులు గెలుస్తున్నా ఆడే ప్రతీ మ్యాచ్ మాత్రం పెద్ద రణరంగంగాన్నీ తలపిస్తుంది. పాకిస్థాన్ మ్యాచ్ తో స్టార్ట్ అయిన ఈ గొడవలు ఆ తర్వాత నేపాల్ తాజాగా నిన్న కువైట్ మ్యాచ్ లో కూడా టీమిండియా ఆటగాళ్లు గొడవపడ్డారు.
ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఉన్న క్రీడల్లో ఫుట్ బాల్ టాప్ లో ఉంటుంది. విదేశాల్లో ఈ ఆటకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. ఆడేది లీగ్ మ్యాచ్ అయినా.. క్లబ్ మ్యాచ్ అయినా అభిమానులతో స్టేడియం నిండిపోతుంది. ఒక్క గోల్ కొడితే చాలు గ్రౌండ్ అంతా హోరెత్తిపోతుంది. ఇక్కడ ప్లేయర్లకు ఉండే క్రేజ్ ఎలాంటిదో మెస్సీ, రోనాల్డో ని చూస్తే తెలిసిపోతుంది. అయితే భరత్ లో మాత్రం ఫుట్ బాల్ కి ఎలాంటి క్రేజ్ లేదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఫుట్ బాల్ వరల్డ్ కప్ కి మన దేశం అర్హత కూడా సాధించలేకపోతుంది. కొంతమందికి అయితే ఈ గేమ్ లో ఉండే రూల్స్ కూడా తెలియవు. సునీల్ ఛైత్రీ లాంటి ఆటగాళ్లు ఒంటరి పోరాటం చేస్తున్న ఫుట్ బాల్ కి పెద్దగా ఆదరణ అయితే రావడం లేదు. ఈ నేపథ్యంలో ఫుట్ బాల్ మ్యాచుల్లో గొడవలు జరగడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది.
బెంగళూరు వేదికగా ఇటీవలే సాఫ్ టోర్నీ ఆరంభమైన సంగతి తెలిసిందే. అయితే భారత ఫుట్ బాల్ టీం వరుసగా మ్యాచులు గెలుస్తున్నా ఆడే ప్రతీ మ్యాచ్ మాత్రం పెద్ద రణరంగంగాన్నీ తలపిస్తుంది. గెలుస్తున్నామనే ఆనందమో.. లేకపోతే ప్రత్యర్థి ఆటగాళ్లు మన ప్లేయర్లను రెచ్చగొడుతున్నారో తెలియదు గాని ఆన్ ఫీల్డ్ లో భారత ఆటగాళ్లు.. ప్రత్యర్థులతో అస్సలు తగ్గడం లేదు. ఢీ అంటే ఢీ అంటూ పలుమార్లు ప్రత్యర్థి ఆటగాళ్ల కవ్వించగా కొన్నిసార్లు ఆటలో భావోద్వేగాలు, పరిస్థితుల కారణంగా గొడవల తీవ్రత తీవ్ర ఘర్షణకు దారి తీస్తున్నాయి. పాకిస్థాన్ మ్యాచ్ తో స్టార్ట్ అయిన ఈ గొడవలు ఆ తర్వాత నేపాల్ తాజాగా నిన్న కువైట్ మ్యాచ్ లో కూడా టీమిండియా ఆటగాళ్లు గొడవపడ్డారు. ఇక పూర్తి వివల్లోకెళ్తే..
సాఫ్ 2023 లో భాగంగా భారత్ – కువైట్ మధ్య బెంగళూరు స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇక ఈ మ్యాచులో ఆట కన్నా.. ఆటగాళ్ల గొడవ మెయిన్ హైలెట్ గా మారింది. ఇందులో భాగంగా 64వ నిమిషయంలో టీమిండియా కోచ్ ఇగోర్ స్టిమాక్ మరోసారి రిఫరీ ఆగ్రహానికి గురయ్యాడు. బంతిని పట్టుకుని ఆటకు ఆటంకం కలిగించాడనే కారణంగా ఆయనకు మరోసారి రెడ్ కార్డ్ చూపించారు రిఫరీలు. భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ లో కూడా ఇదే మాదిరిగా జరిగింది. తాజాగా కువైట్ తో జరిగిన ఈ మ్యాచులో కూడా జరిగిన వాగ్వాదం ఇరు ఆటగాళ్లు కొట్టుకునే స్థాయికి తీసుకువెళ్ళింది. మ్యాచ్ మరో 10 నిమిషాల్లో ముగుస్తుందనగా.. భారత ఫార్వర్డ్ రహీమ్ అలీ సహనాన్ని కోల్పోయి కువైట్ ఆటగాడు అల్ ఖలాఫ్ ను కిందకు తోసేశాడు. దీంతో ఆటలో గొడవలు తార స్థాయికి వెళ్లాయి. ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరినొకరు నెట్టుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అసలే దేశంలో ఫుట్ బాల్ కి క్రేజ్ తక్కువగా ఉన్న నేపథ్యంలో ఇలాంటి గొడవలు భారత ఫుట్ బాల్ టీంకి మంచిది కాదనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
More chaos after Sahal is left in a heap as Kuwait try to get the ball back after a foul call. The coaching staff is involved in it as well before the ref breaks it up, but Rahim Ali is sent off! pic.twitter.com/owoXhieEfl
— Anantaajith Raghuraman (@anantaajith) June 27, 2023