”బంగ్లాతో జరిగే టెస్ట్ సిరీస్ లో టీమిండియా అగ్రెసివ్ బ్యాటింగ్ చూస్తారు. వేగంగా పరుగులు ఎలా చేయాలో చూపిస్తాం” వన్డే సిరీస్ ఓడిపోయిన తర్వాత టెస్ట్ మ్యాచ్ ప్రారంభానికి ముందు టీమిండియా తాత్కాళిక కెప్టెన్ కేఎల్ రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇవి. తాజాగా ఈ వ్యాఖ్యలపై స్పందించాడు టీమిండియా స్టార్ ఫినిషర్ దినేష్ కార్తిక్. కేఎల్ రాహుల్ వ్యాఖ్యలను నేను ఏకీభవించడం లేదని డీకే తెలిపాడు. అదీ కాక బంగ్లాదేశ్ పిచ్ లపై ఇంగ్లాండ్ టీమ్ ఆడినట్లు బజ్ బాల్ తరహాలో ఆడటం ఇక్కడ సాధ్యపడదు అని దినేష్ కార్తిక్ పేర్కొన్నాడు.
“ఇంగ్లాండ్ జట్టు పాక్ తో ఆడుతున్న బజ్ బాల్ తరహా ప్రదర్శన అన్ని జట్లకు సాధ్యం కాకపోవచ్చు. పిచ్ పరిస్థితులను బట్టి ఆటగాడు తన నైపుణ్యాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది. అంతేకానీ ఇంగ్లాండ్ టీమ్ ఆడినట్టు.. ఇండియా టీమ్ ఆడదు. అలా ఆడటం టీమిండియా DNAలోనే లేదు. అయితే టెస్ట్ ఛాంపియన్ షిప్ లో మంచి స్కోర్ సాధించడానికి ఈ మ్యాచ్ లు చాలా కీలకమైనవి. అందుకే వేగంగా ఆడాలని వారు చూస్తున్నారు. కానీ బంగ్లా పిచ్ లు అందుకు ఏ మాత్రం సహకరించవు” అని దినేష్ కార్తిక్ పేర్కొన్నాడు. అదీకాక టెస్ట్ ల్లో బ్యాటింగ్ చేసేటప్పుడు ఓపిక ఉంటే చాలని.. పరుగులు వాటంతట అవే వస్తాయని అన్నాడు.
ఇక టెస్ట్ క్రికెట్ లో నియంత్రణ కోల్పోకుండా ఆడితే చాలు. వికెట్ కాపాడుకోవడానికి గొప్ప టెక్నిక్ లేమీ అవసరం లేదని ఈ సందర్భంగా డీకే చెప్పుకొచ్చాడు. ఇక మ్యాచ్ కు ముందు కేఎల్ రాహుల్ చేసిన వ్యాఖ్యలను నేను అంగీకరించడం లేదని తేల్చి చెప్పాడు. నాకు తెలిసినంత వరకు ఇలాంటి పిచ్ లో మ్యాచ్ లో ఎలాంటి ఫలితాన్ని ఇవ్వవని డీకే అన్నాడు. అయితే డీకే చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. టీమిండియాకు డ్యాషింగ్ గా ఆడటం రాదా? ఒక్క సారి వీరేంద్ర సెహ్వాగ్ ఉన్న కాలంలో ఎలా ఉండేదో గుర్తుకు తెచ్చుకో దినేష్ భాయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అప్పట్లో టీమిండియా ఒక్కరోజులోనే 400 పరుగులను చేసిన మ్యాచ్ లు ఉన్నాయి అంటూ నెటిజన్స్ గుర్తుచేసుకున్నారు.
‘#TeamIndia can’t play #Bazball, need to stick to their own strengths’@DineshKarthik shares his thoughts on #KLRahul‘s statement that was made ahead of the 1st Test vs #Bangladesh, on #CricbuzzChatter#BANvIND pic.twitter.com/SSRzKQFEdd
— Cricbuzz (@cricbuzz) December 15, 2022