సిరీస్ డిసైడర్ మ్యాచ్లో భారత్ అదరగొట్టింది. రాహుల్ త్రిపాఠి(35), శుభ్ మాన్ గిల్(48), అక్సర్ పటేల్(21) మెరుపులు మెరిపిస్తే, వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సునామీ సృష్టించాడు. ఎదుర్కొన్న తొలి బంతి నుంచే ఎదురుదాడికి దిగిన సూర్య 45 బంతుల్లోనే సెంచరీ మార్కు చేరుకున్నాడు. దీంతో టీమిండియా తరఫున వేగవంతమైన టీ20 సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. రోహిత్ శర్మ మొదటి స్థానంలో ఉన్నాడు. 2017 శ్రీలంకపై రోహిత్ 35 బంతుల్లోనే శతకం బాదాడు. టీ20ల్లో సూర్యకి ఇది మూడో శతకం. మొత్తంగా 51 బంతులు ఎదుర్కొన్న సూర్య 7 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 112 పరుగులు చేశాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో 228 పరుగులు భారీ స్కోర్ చేసింది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు శుభారంభం దక్కలేదు. మధు షనక వేసిన తొలి ఓవర్ లోనే ఇషాన్ కిషన్(1) క్యాచ్ ఔట్ గా పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి 35(16 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), గిల్ 46(36 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు)తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మహేష్ థీక్షణ వేసిన ఐదో ఓవర్లో మూడు ఫోర్లు బాదిన త్రిపాఠి, కరుణరత్నే వేసిన ఆరో ఓవర్లో సిక్సర్ బాది, ఆ తర్వాత భారీ షాట్కు ప్రయత్నించి ఔటయ్యాడు.
Suryakumar Yadav in this T20I series against Sri Lanka:
7(10).
51(36).
112*(51).3 innings, 170 runs, 85 Average, 175.26 strike rate. pic.twitter.com/nLhyzL5lUc
— CricketMAN2 (@ImTanujSingh) January 7, 2023
తరువాత క్రీజులోకి వచ్చిన సూర్య విధ్వంసాన్ని ఆపడం శ్రీలంక బౌలర్ల వల్ల కాలేదు. ప్రతి ఓవర్ లో రెండు.. మూడు బౌండరీలు బాదిన సూర్య 45 బంతుల్లోనే సెంచరీ మార్కు చేరుకున్నాడు. మొత్తంగా 51 బంతులు ఎదుర్కొన్న సూర్య 7 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 112 పరుగులు చేశాడు. చివర్లో అక్షర్ పటేల్(21) కూడా చెలరేగిపోయాడు. 9 బంతుల్లో 4 ఫోర్లు బాదాడు. దీంతో భారత్, లంక ముంగిట 229 పరుగులు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. కాగా, రెండో టీ20లోశ్రీలకం 16 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ALL three of Suryakumar Yadav’s T20I hundreds are in the top five of India’s fastest ⚡
He only made his T20I debut in 2021! pic.twitter.com/U10YgvRjs0
— ESPNcricinfo (@ESPNcricinfo) January 7, 2023