ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో భాగంగా వరుస పరాజయాల నడుమ కొట్టుమిట్టాడుతున్న తరుణంలో టీమిండియా తన సత్తా ఏంటో చూపించింది. మొదట పాకిస్తాన్ తో ఓడిపోవటంతో టీమిండియాని అంతా చిన్న చూపు చూశారు. ఆ తర్వాత న్యూజిలాండ్ తో జరిగిన ఈ మ్యాచ్ లో నైన గెలుస్తారేమోనని అందరూ ఆశగా ఎదురుచూశారు. కానీ ఈ మ్యాచ్ లో సైతం పేలవ ప్రదర్శనతో ఆకట్టుకోలేకపోయారు. అయితే ఇలాంటి సమయంలో బుధవారం అఫ్గానిస్థాన్తో జరిగిన ఈ మ్యాచ్ లో టీమిండియా అసలు పవర్ ఏంటో మరోసారి రుచి చూపించింది.
టీ20 వరల్డ్ కప్ 2021 లో ఏ టీమ్ చేయలేని భారీ స్కోర్ చేసి ప్రత్యర్ధి జట్టైన అఫ్గానిస్థాన్కు వణుకు పుట్టించింది. మొదటగా బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత భారీ లక్ష్య చేదనతో బ్యాటింగ్ కు దిగిన అఫ్గానిస్థాన్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసి ఓడిపోయింది. ఇక టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ-74. కేఎల్ రాహుల్ – 69 పరుగులతో చెలరేగిపోయి సెమిస్ కు వెళ్లేందుకు మార్గం సుగుమం చేశారు.
అయితే భారత్ సెమిస్ కు వెళ్లాలంటే.. తదుపరి మ్యాచ్ లు భారీ తేడాతో విజయం సాధించాలి. అలాగైతేనే తప్పా టీమిండియా సెమిస్ కు వెళ్లలేదు. ఇక భారత్ జట్టు తర్వాత మ్యాచ్లని శుక్రవారం స్కాట్లాండ్తో ఉండగా ఆ తర్వాత నమీబియాతో సోమవారం ఆడనుంది. ఈ రెండు మ్యాచ్లకీ దుబాయ్ స్టేడియం వేదిక ఇవ్వనుంది. తలపడనుంది. ఒకవేళ నమీబియాతో కివీస్ గెలిచినా.. అఫ్గానిస్థాన్ చేతిలో ఓడిపోతే..? అప్పుడు న్యూజిలాండ్ 6 పాయింట్లతో రేసులో నిలుస్తుంది. మరోవైపు భారత్ కూడా తన చివరి రెండు మ్యాచ్ల్లో గెలిస్తే..? ఆరు పాయింట్లతో కివీస్తో సమానంగా పాయింట్ల పట్టికలో ఉంటుంది. అప్పుడు నెట్ రన్రేట్ కీలకం కానుంది. మరి టీమిండియా ఆడబోయే తర్వాత మ్యాచ్ భారీ తేడాతో గెలుస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.