టెస్టు క్రికెట్ లో ఇది అసలు సిసలైన మజా. ఐదు రోజుల పాటు జరిగిన ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మ్యాచ్ థ్రిల్లర్ మూవీని తలపించింది. ఇంగ్లీష్ జట్టు ఆడిన బజ్ బాల్ గేమ్ ని కివీస్ బద్దలు కొట్టేసింది.
భారత్-ఆస్ట్రేలియా మధ్య తాజాగా జరిగిన రెండు టెస్టులూ తలో మూడు రోజుల్లోనే ముగిసిపోయాయి. దీంతో చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. టెస్టు మజాని చంపేస్తున్నారంటూ విమర్శలు చేశారు, చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి వారికోసమే అన్నట్లు ఇంగ్లాండ్-న్యూజిలాండ్ రెండో టెస్టు అద్భుతమైన మజాని ఇచ్చింది. ఓ టెస్టులో ఏమేం థ్రిల్లర్ అంశాలు కావాలో దీనిలో అన్ని ఉన్నాయి. ఒక్క పరుగుతో టెస్టు గెలవడం మనం చూసుండం. ఈ మ్యాచ్ లో అదే జరిగింది. ఇంగ్లాండ్ బజ్ బాల్ గేమ్ ని కూడా న్యూజిలాండ్ తన అద్భుతమైన ఆటతో బద్దలు కొట్టింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఇంగ్లాండ్ జట్టు న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. ఇందులో భాగంగా రెండు టెస్టులు ఆడింది. మౌంట్ మాంగనూయి వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో ఇంగ్లీష్ జట్టు 267 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. అతిథ్య కివీస్ ను రెండు ఇన్నింగ్సుల్లోనూ తక్కువ పరుగులకే ఔట్ చేసి తమ పవర్ చూపించింది. ఈ మ్యాచులో బజ్ బాల్ గేమ్ ప్రయోగం చేసింది. అంటే ఆలౌట్ కాకముందే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి న్యూజిలాండ్ ని బ్యాటింగ్ కు ఆహ్వానించింది. అది తొలి టెస్టులో బాగానే వర్కౌట్ అయింది. రెండో టెస్టులోనూ సేమ్ ప్రయోగం చేసి గెలిచేయాలని ఇంగ్లాండ్ జట్టు పెద్ద ప్లాన్ వేసింది. కానీ కివీస్ ఆటగాళ్ల దెబ్బకు మొత్తం తలకిందులైపోయింది.
వెల్లింగ్టన్ వేదికగా తాజాగా ముగిసిన రెండో టెస్టులోనూ ఫస్ట్ ఇన్నింగ్స్ లో తొలుత ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేసింది. 435/8 పరుగుల దగ్గర డిక్లేర్ ఇచ్చేసింది. అనంతరం కివీస్ తన తొలి ఇన్నింగ్స్ లో209 పరుగులకే ఆలౌటైపోయింది. అయితే ఆతిథ్య న్యూజిలాండ్ ను ఇంగ్లాండ్ ఫాలో ఆన్ ఆడించింది. మ్యాచ్ అయిపోయిన తర్వాత గానీ తాము ఎంత పెద్ద తప్పు చేశామనేది ఆ జట్టుకు అర్థం కాలేదు. ఎందుకంటే రెండో ఇన్నింగ్సులో కేన్ విలియమ్సన్(132) అద్భుతమైన బ్యాటింగ్ చేయడంతో 483 రన్స్ దగ్గర ఆలౌటైపోయింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లీష్ జట్టు 256 పరుగులకు ఆలౌటైపోయింది. కేవలం ఒక్కటంటే ఒక్క పరుగు తేడాతో మ్యాచ్ ని చేజార్చుకుంది. తొలి టెస్టు మాదిరి ఇందులో గెలిచేయాలని బజ్ బాల్ గేమ్ ట్రై చేసిన ఇంగ్లాండ్ మొత్తానికే బొక్కాబోర్లా పడింది. దీంతో సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది.
అయితే ఇంగ్లాండ్ పై రెండో టెస్టులో ఒక్క పరుగు తేడాతో గెలిచిన న్యూజిలాండ్ జట్టు అరుదైన ఘనత సాధించింది. ఫాలో ఆన్ ఆడి మ్యాచ్ గెలిచిన నాలుగో జట్టుగా రికార్డ్ క్రియేట్ చేసింది. అంతకు ముందు 1894లో ఇంగ్లాండ్, 1981లో ఇంగ్లాండ్, 2001లో టీమిండియా, ఇప్పుడు న్యూజిలాండ్ ఈ ఘనత సాధించిన జట్లుగా నిలిచాయి. ఇక ఇదే మ్యాచులో సెంచరీతో ఆకట్టుకున్న విలియమ్సన్.. కివీస్ తరఫున టెస్టుల్లో ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్ గా రికార్డ్ సృష్టించాడు. ప్రస్తుతం కేన్ 7,787 రన్స్ తో ఉండగా.. అతడి తర్వాత స్థానంలో రాస్ టేలర్ (7,683) ఉన్నాడు. మరి కివీస్ గెలుపుపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.
Teams to win after the Follow-on:
1) ENG vs AUS in 1894
2) ENG vs AUS in 1981
3) IND vs AUS in 2001
4) NZ vs ENG in 2023— Johns. (@CricCrazyJohns) February 28, 2023