శుక్రవారం జరిగిన ఐపీఎల్ 2021 ఫైనల్లో కోల్కత్తా నైట్రైడర్స్ను ఓడించి ఏకంగా 4వ సారి ఐపీఎల్ ట్రోఫీ గెలిచి చరిత్ర సృష్టించింది చెన్నై సూపర్ కింగ్స్. సీఎస్కే సాధించిన అసాధారణ విజయం వెనుకాల ఉన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బ్యాట్తో పరుగులు చేయకున్నా సీఎస్కే బలం ధోనినే. కెప్టెన్గా అతని ఇంపాక్ట్ అంతలా ఉంటుంది. చెన్నై నాలుగో సారి ట్రోఫీ గెలవడంతో ధోని ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. సీఎస్కే మ్యాచ్ గెలవగానే వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు.
వీరి ఆనందాన్ని రెట్టింపు చేస్తూ సురేష్ రైనా భార్య మరో గుడ్ న్యూస్ చెప్పింది. ధోని రెండో సారి తండ్రి కాబోతున్న విషయాన్ని బయటపెట్టింది. ధోని భార్య సాక్షి ప్రస్తుతం నాలుగు నెలల గర్భవతి, ఈ విషయాన్ని రైనా భార్య ప్రియాంక చౌదరి వెల్లడించారు. దీంతో ధోని అభిమానులకు మరో పండగలాంటి వార్త చెప్పినట్లు అయింది. 2010 జులైలో సాక్షి-ధోనిల వివాహం జరిగింది. 2015లో వీరికి జీవా సింగ్ ధోని జన్మించింది. కాగా ధోని ఇప్పుడు రెండో సారి తండ్రి కాబోతున్నాడు.