టీమిండియా తరఫున ఆడాలంటే ఒకప్పుడు చాలా కష్టపడాల్సి వచ్చేది. కానీ టీ20ల మేనియా పెరిగిన తర్వాత యంగ్ క్రికెటర్లు చాలామంది వెలుగులోకి వచ్చారు. అలాంటి వారిలో సంజూ శాంసన్ ఒకడు. కేరళకు చెందిన ఈ బ్యాటర్.. జట్టులోకి అడపాదడపా వస్తూనే ఉన్నాడు. కానీ ఆ ఛాన్సులను సరిగా వినియోగించుకోలేకపోయాడు. ఐసీసీ టోర్నీ కోసం భారత జట్టు ప్రకటించిన ప్రతిసారి.. సంజూ గురించే నెటిజన్లు ఎక్కువగా మాట్లాడుకునేవారు. తాజాగా జరిగిన టీ20 వరల్డ్ కప్ లోనూ భారత్ సెమీస్ లో ఓడిపోవడంతో మనోడు మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. దిల్లీలో క్రికెట్ కెరీర్ ప్రారంభించిన సంజూ.. తన గేమ్ ని డెవలప్ చేసుకునేందుకు సొంత రాష్ట్రం కేరళకు షిప్ట్ అయ్యాడు. 17 ఏళ్ల వయసులో ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. అదే ఏడాది అంటే 2012లో అద్భుతమైన బ్యాటింగ్ తో అండర్-19 ఆసియాకప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. దేశవాళీలో అదిరిపోయే బ్యాటింగ్ తో సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. అలా 2015లో జింబాబ్వే జట్టుపై టీ20 అరంగేట్రం చేశాడు. కానీ జట్టులో పర్మినెంట్ ప్లేస్ దక్కించుకోవడంలో మాత్రం ఫెయిలయ్యాడు. అందుకే శాంసన్.. జట్టులో వస్తూ పోతూ ఉన్నాడు.
ఇక దేశవాళీలో అదరగొట్టడంతో 2013లోనే ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. రాజస్థాన్ జట్టులో కీలక సభ్యుడిలా మారాడు. ప్రస్తుతం అదే జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ లో తన జట్టును ఫైనల్ కి తీసుకెళ్లినప్పటికీ కప్ మాత్రం అందించలేకపోయాడు. సరే ఇదంతా పక్కనబెడితే.. నవంబరు 11న తన పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన పలువురు నెటిజన్స్.. అతడికి శుభాకాంక్షలు చెబుతున్నారు. టీమిండియాలో చోటు దక్కించుకుని అద్భుత ఇన్నింగ్సులు ఆడాలని కోరుకుంటున్నారు.
From Sanju’s birthday celebration ❤️🤩#SamsonDay #SanjuSamson #HappyBirthdaySanjuSamson pic.twitter.com/z8LsRK0YDp
— Sanju Samson Fans Page (@SanjuSamsonFP) November 10, 2022