ఈ ఏడాది చైనా ఆతిధ్యమిస్తున్న ఆసియా క్రీడలకు టీమిండియా కూడా ఆడనుంది. తాజాగా 15 మంది ప్రాబబుల్స్ తో కూడిన భారత జట్టుని సెలక్ట్ చేసారు.
ఈ ఏడాది ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలు జరగనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు జరగనున్న ఈ టోర్నీకి చైనా ఆతిధ్యమిస్తుంది. ఇక ఈ టోర్నీలో ఇప్పటివరకు ఇండియన్ క్రికెట్ టీం ఆడకపోయినా.. తొలిసారి ఈ టోర్నీ ఆడేందుకు బీసీసీఐ ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా టీ 20 ఫార్మాట్ లో ఈ టోర్నీ నిర్వహించనున్నారు. ఇక తాజాగా ఏ టోర్నీకి సంబంధించిన టీమిండియా జట్టుని శుక్రవారం రాత్రి ప్రకటించేశారు. 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టుని చైనాకి పంపనున్నారు. ఈ టీంకి రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ చేయనున్నాడు. పూర్తి వివరాలు ఇపుడు చూద్దాం.
ఎప్పుడూ లేని విధంగా ఈ సారి ఆసియా గేమ్స్ కి బీసీసీఐ సై అంటుంది. ఓ వైపు సీనియర్ టీం స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ ఆడుతుంటే మరో వైపు ఆసియా గేమ్స్ తో జూనియర్ జట్టు చైనాలో సందడి చేయనున్నారు. దీంతో అభిమానులకి ఈ సారి డబుల్ కిక్ లభించనుంది.ఇక ఆసియా గేమ్స్ జట్టుని ఒకసారి చూసుకుంటే ఓపెనర్లుగా గైక్వాడ్, జైస్వాల్ తో పాటు రాహుల్ త్రిపాఠి ని సెలక్ట్ చేశారు. వికెట్ కీపర్లుగా జితేష్ శర్మ, ప్రభ్ సిమ్రాన్ సింగ్, మిడిల్ ఆర్డర్ లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మతో పాటు రింకు సింగ్ కి అవకాశం దక్కింది.
వాషింగ్ టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శివమ్ దూబే ఆల్ రౌండర్ల కోటాలో స్థానం దక్కించుకోగా.. రవి బిష్ణోయ్ ని ఏకైక స్పిన్నర్ గా సెలక్ట్ చేశారు. ఇక పేస్ బాధ్యతలను అర్షదీప్ సింగ్, ముకేశ్ కుమార్, ఆవేశ ఖాన్, శివమ్ మావి పంచుకోనున్నారు. ఈ జట్టుకి రుతురాజ్ గైక్వాడ్ సారధ్యం వహించగా వైస్ కెప్టెన్ ని ప్రకటించలేదు. గతకొంతకాలంగా భారత్ ఆసియా క్రీడలకు వెళ్లే జట్టుకు సీనియర్ శిఖర్ ధావన్ కెప్టెన్సీ చేస్తాడనే వార్తలు వచ్చినా గైక్వాడ్ వైపే సెలక్టర్లు మొగ్గు చూపారు. మొత్తానికి పటిష్టంగా ఉన్న మన జట్టు ఈ సారి దేశానికీ గోల్డ్ మెడల్ తీసుకొస్తుందేమో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
NEWS 🚨- Team India (Senior Men) squad for 19th Asian Games: Ruturaj Gaikwad (Captain), Yashasvi Jaiswal, Rahul Tripathi, Tilak Varma, Rinku Singh, Jitesh Sharma (wk), Washington Sundar, Shahbaz Ahmed, Ravi Bishnoi, Avesh Khan, Arshdeep Singh, Mukesh Kumar, Shivam Mavi, Shivam…
— BCCI (@BCCI) July 14, 2023