ఆస్ట్రేలియా కెప్టెన్, స్టార్ క్రికెటర్ ప్యాట్ కమిన్స్ ఇంట్లో విషాదం నెలకొంది. దీంతో నాలుగో టెస్టులో ఆసీస్ ఆటగాళ్ల నల్ల బ్యాండ్స్ ధరించారు. ఇంతకీ కమిన్స్ ఇంట్లో ఎవరు చనిపోయారు?
బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో చివరిదైన నాలుగో టెస్టు అహ్మదాబాద్ వేదికగా జరుగుతోంది. తొలిరోజు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు బాగానే బ్యాటింగ్ చేసింది. 255/4 పరుగులు చేసి ఆకట్టుకుంది. తొలి రెండు టెస్టుల్లో విజయం సాధించిన భారత జట్టు.. మూడో మ్యాచులో ఓడిపోయింది. దీంతో ప్రస్తుతం జరుగుతున్న టెస్టు టీమిండియాకు చాలా కీలకం. అయితే ఈ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తిరిగొచ్చేస్తాడని చాలామంది అనుకున్నారు. కానీ అతడి ఇంట్లోనే విషాదం నెలకొంది. దీంతో అతడు స్వదేశంలోనే ఉండిపోవాల్సి వచ్చింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. భారత పర్యటనలో భాగంగా నాలుగు టెస్టుల సిరీస్ ని తొలుత ఆడింది. తొలి రెండు మ్యాచుల్లో ఆసీస్ జట్టు చిత్తుగా ఓడిపోయింది. దీంతో కంగారూలపై తీవ్ర విమర్శలు చేశారు. ఇలాంటి టైంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. సడన్ గా స్వదేశానికి వెళ్లిపోవడంతో ఏం జరిగిందా అని అందరూ అనుకున్నారు. అయితే కమిన్స్ తల్లి మారియాకు అనారోగ్యం వల్ల ఇలా చేశాడని తర్వాత తెలిసింది. తాజాగా ఆమెనే తుదిశ్వాస విడిచింది. ఆమె మృతికి సంతాపంగా.. భారత్-ఆస్ట్రేలియా నాలుగో టెస్టు రెండో రోజు .. ఆస్ట్రేలియా ఆటగాళ్లు నల్ల బ్యాండ్స్ తో బరిలోకి దిగారు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం కమిన్స్ లేకపోవడంతో.. స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్సీ చేస్తున్నాడు. మూడో టెస్టుకు కూడా సారథ్యం వహించిన స్మిత్.. ఆ మ్యాచ్ ని గెలిపించాడు. ఇప్పుడు నాలుగో టెస్టులో విజయం సాధించేలా కనిపిస్తున్నాడు. తొలిరోజు ఆస్ట్రేలియా బాగానే బ్యాటింగ్ చేసింది. కానీ ఐదు రోజులు పూర్తయితే గానీ రిజల్ట్ ఏంటనేది చెప్పలేం. మరోవైపు ఈ సిరీస్ లో 2-1తో ఇప్పటికే ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. చివరి పోరులో గెలిచి టాప్ ర్యాంక్ దక్కించుకోవడంతో పాటు వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ కు అర్హత సాధించాలని భావిస్తోంది. మరి చూడాలి ఏం జరుగుతుందో?
Our deepest condolences to Pat Cummins and his family, our thoughts are with you all during this time.
📸: Pat Cummins/Instagram#CricTracker #PatCummins #INDvAUS #BGT pic.twitter.com/JeSr4VWpdb
— CricTracker (@Cricketracker) March 10, 2023