లక్ష్యం 444 పరుగులు..ఒవెల్ గ్రౌండ్ లో ఇప్పటివరకు ఏ టీం కూడా ఇంత భారీ లక్ష్యాన్ని చేధించిన దాఖలాలు లేవు. స్వింగ్ పిచ్ ల మీద ఆసీస్ బౌలింగ్ ఎదుర్కోవడం శక్తికి మించిన పని. ఇప్పటివరకు టెస్టుల్లో ఛేజింగ్ ప్రపంచ రికార్డ్ 414 పరుగులు. కానీ ఒక్క విషయంలో మాత్రం భారత్ ఆసీస్ ని బయపెడుతుంది
భారత్ ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ ఆసక్తికరంగా మారింది. మొదటి రెండు రోజులు ఆసీస్ ఆధిపత్యం చూపించినా.. ఆ తర్వాత భారత్ పుంజుకున్న తీరు అద్భుతం. మూడో రోజు రహానే, శార్ధూల్ రాణించడంతో ఫాలో ఆన్ తప్పించుకున్న భారత్.. ఆ తర్వాత బౌలింగ్ లోనూ చెలరేగి ఆసీస్ ని భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేసింది. మొత్తానికి 444 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నాలుగో రోజు ఆట ముగిసేసరికి 3 వికెట్లకు 164 పరుగులు చేసింది. గ్రీజ్ లో ఛేజింగ్ కింగ్ విరాట్ కోహ్లీ(44) రహానే (20) ఉన్నారు. భారత్ విజయానికి మరో 280 పరుగులు కావాలి. చేతిలో ఏడు వికెట్లు ఉన్నాయి. ఆసీస్ గెలవాలంటే చివరి రోజు 7 వికెట్లు తీయాల్సిందే. ఈ నేపథ్యంలో టీమిండియా విజయం సాధించడం కష్టంగానే కనిపిస్తుంది.
లక్ష్యం 444 పరుగులు..ఒవెల్ గ్రౌండ్ లో ఇప్పటివరకు ఏ టీం కూడా ఇంత భారీ లక్ష్యాన్ని చేధించిన దాఖలాలు లేవు. స్వింగ్ పిచ్ ల మీద ఆసీస్ బౌలింగ్ ఎదుర్కోవడం శక్తికి మించిన పని. ఇప్పటివరకు టెస్టుల్లో ప్రపంచ రికార్డ్ 414 పరుగులు. ఎలా చూసుకున్నా ఈ మ్యాచులో భారత్ గెలవడం కష్టమే అనే అభిప్రాయలు ఉన్నాయి. కానీ ఒక్క విషయంలో మాత్రం ఆసీస్ కి భారత్ నుంచి ముప్పు పొంచి ఉంది. అదేంటో కాదు.. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో 400 కొట్టినప్పటికీ టెస్టు మ్యాచ్ ఓడిపోయిన సందర్భాలు 4 మాత్రమే. ఈ నాలుగు సార్లు మన టీమిండియా మీదే కావడం విశేషం. ఈ విషయంలో భారత్ ని తక్కువగా అంచనా వేస్తే ఆసీస్ భారీ మూల్యం తప్పదు.
90 ఓవర్లలో 280 పరుగులు రోజు ఛేజింగ్ చేయడం చివరి రోజు ఒక రకంగా కష్టమనే చెప్పుకోవాలి. ఎందుకంటే చివరి రోజు పిచ్ బౌలింగ్ కి అనుకూలిస్తుంది అని అందరికీ తెలిసిన విషయమే. కానీ గ్రీజ్ లో విరాట్ కోహ్లీ ఉండడం రహానే మంచి టచ్ లో ఉండడంతో విజయంపై ఇంకా ఆశలు అలాగే ఉన్నాయి. 2021 లో జరిగిన బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో 387 పరుగుల లక్ష్యాన్ని కూడా టీమిండియా ఛేజ్ చేసిన సంగతి గుర్తుంచుకోవాలి. అదికాక ఆస్ట్రేలియా మీద చివరి నాలుగు టెస్టు సిరీస్ లు గెలిచిన ఘనత టీమిండియాది. ఈ రకంగా చూసుకుంటే ఆస్ట్రేలియాని చివరి రోజు ఫేవరేట్ గా పరిగణించినా .. భారత్ ని మాత్రం తక్కువగా అంచనా వేస్తే మరో పరాభవం తప్పదు. మరి చివరి రోజు ఎవరు ఆధిపత్యం చూపిస్తారో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.