అంబటి రాయుడు రిటర్మెంట్ వ్యవహారం గురించి రోజుకొక చర్చ నడుస్తూనే ఉంది. ఏ విషయం ఇప్పట్లో ఒక కొలిక్కి వచ్చేలా కనబడడం లేదు. ఇదిలా ఉండగా.. తాజాగా విజయ్ శంకర్ ప్లేస్ లో అనుభవం, సీనియారిటీ ఉన్న ప్లేయర్ను సెలెక్ట్ చేస్తే బాగుండేది అని చెప్పుకొచ్చాడు.
2019 వన్డే వరల్డ్ కప్ సంఘటనలు అంబటి రాయుడు ఇంకా మర్చిపోయినట్టు లేడు. ఇటీవలే క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన రాయుడు మరోసారి 2019 ప్రపంచ కప్ లో తనకు జరిగిన అన్యాయాన్ని గురించి ప్రస్తావించాడు. ఇటీవలే బీసీసీఐ తనను వరల్డ్ కప్ కి సిద్ధంగా ఉండమన్నారని.. కానీ తీరా చూస్తే వరల్డ్ కప్ లో తనకు స్థానం లభించలేదని రాయుడు తెలిపాడు. సెలెక్టర్ ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన 2019 వన్డే వరల్డ్ కప్లో తనను భారత జట్టుకు ఎంపిక చేయకపోవడం వెనుక ఎమ్మెస్కే ప్రసాద్ హస్తమున్నదని.. ఆయన కక్షగట్టి తనను వన్డే వరల్డ్ కప్ జట్టులోకి రాకుండా అడ్డుకున్నాడని రాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇదిలా ఉండగా.. తాజాగా విజయ్ శంకర్ ప్లేస్ లో రహానే ని సెలెక్ట్ చేస్తే బాగుండేది అని చెప్పుకొచ్చాడు.
అంబటి రాయుడు రిటర్మెంట్ వ్యవహారం గురించి రోజుకొక చర్చ నడుస్తూనే ఉంది. ఏ విషయం ఇప్పట్లో ఒక కొలిక్కి వచ్చేలా కనబడడం లేదు. 2019 వరల్డ్ కప్ కి ముందు రాయుడు అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో తెలుగు క్రికెటర్ ఈ వరల్డ్ కప్ లో సెలెక్ట్ కావడం పక్కా అనుకున్నారు. తుది జట్టులో స్థానం దక్కకపోయినా కనీసం స్క్వాడ్ లో స్థానం దక్కుతుందని ఆశించారు. కానీ ఊహించినదేమి జరగలేదు. దీంతో తన దురదృష్టం అని సర్దుకుపోయిన రాయుడికి శిఖర్ ధావన్ గాయపడడంతో అదృష్టం వెతుకుంటూ వచ్చింది. టీంఇండియాలో ధావన్ ప్లేస్ లో రాయుడు రాక కన్ఫర్మ్ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ధావన్ స్థానంలో త్రీడి ప్లేయర్ అని విజయ్ శంకర్ ని సెలెక్ట్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
తాజాగా తన స్థానంలో విజయ్ శంకర్ను ఆడించడంపై కూడా రాయుడు అభ్యన్తరాన్ని తెలియజేశాడు. ఈ సందర్భంగా రాయుడు మాట్లాడుతో.. “నన్ను తప్పించినందుకు నాకేం బాధ లేదు. కానీ నా స్థానంలో అజింక్య రహానే వంటి ఆటగాళ్లను సెలెక్ట్ చేస్తే బాగుండేది. అనుభవం, సీనియారిటీ ఉన్న ప్లేయర్ను ఎంపిక చేస్తే అసలు చర్చ జరిగుండేది కాదు. అందరూ భారత్ గెలవాలనే అనుకుంటారు కదా. అసలు నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదనే కారణం కూడా ఎవరికీ తెలీదు. ఆ సెలెక్ట్ చేసిన వాళ్లే అది చెప్పాలి” అని రాయుడు ఈ సందర్భంగా తెలియజేశాడు.