విదేశీ, స్వదేశీ అన్న తేడా లేకుండా భారత జట్టు వరుస విజయాలతో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఐసీసీ టోర్నీల్లో విఫలమైనా.. ద్వైపాక్షిక సిరీసుల్లో మాత్రం భారత్దే పైచేయి ఉంటోంది. అందులోనూ.. స్వదేశంలో పరిమిత ఓవర్ల ఫార్మాట్లో చూసుకుంటే భారత జట్టుకు అడ్డులేదనే చెప్పాలి. విజయాలు ఏకపక్షంగా సాగుతున్నాయి. 2019 వన్డే వరల్డ్ కప్ తరువాత నుంచి వెస్టిండీస్పై 2-1, ఆస్ట్రేలియాపై 2-1, ఇంగ్లాండ్పై 2-1, వెస్టిండీస్పై 3-0, సౌతాఫ్రికాపై 2-1, శ్రీలంకపై 3-0, న్యూజిలాండ్పై 3-0.. ఇలా ఏ ఒక్క సిరీస్ చేజారిపోకుండా కైవసం చేసుకుంటున్నారు. దీంతో ఈ ఏడాది భారత్ వేదికగా జరగబోయే వన్డే ప్రపంచ కప్ ను ఇండియానే సొంతం చేసుకుంటుందన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో పాక్ మాజీ మాజీ క్రికెటర్ ఆకిబ్ జావెద్ భారత విజయాలను హేళన చేసేలా వ్యాఖ్యానించారు.
కొత్త ఏడాది ఆరంభంలో మిత్ర దేశం శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా, ఇటీవల కివీస్ తో జరిగిన వన్డే సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. అందులోనూ.. ఈ సిరీస్లలో భారత బ్యాటర్లు పరుగుల వరద పారించారు. డబుల్ సెంచరీలు, భారీ ఇన్నింగ్స్లు ఆడుతూ ప్రపంచ అగ్రశ్రేణి ఆటగాళ్లకు సవాల్ విసిరారు. కివీస్తో జరిగిన తొలి వన్డేలో 349 పరుగులు చేసిన భారత జట్టు.. రెండో వన్డేలో న్యూజిలాండ్ నిర్ధేశించిన 109 పరుగుల లక్ష్యాన్ని 20 ఓవర్లలోనే చేధించింది. అనంతరం మూడో వన్డేలో ఏకంగా 385 పరుగులు చేసింది. అయితే, భారత్ ఆడుతున్న ఈ భారీ ఇన్నింగ్స్లకు కివీస్ పేలవ బౌలింగే కారణమని ఆకిబ్ జావెద్ వ్యాఖ్యానించాడు.
ODI series India vs New Zealand 3.0 India 👏🙏😍🇮🇳🏏 pic.twitter.com/JzPmOOZrWh
— Papu Telming (@PTelming) January 25, 2023
భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ప్రధాన తేడా బౌలింగ్ బలమేనని చెప్పిన జావెద్.. పాక్ పేస్ దళం పటిష్టంగా ఉందన్నాడు. ‘న్యూజిల్యాండ్ బౌలింగ్, పాకిస్తాన్ బౌలింగ్ యూనిట్ ఒక్కటి కాదు. భారత్ భారీ స్కోర్లు చేయడానికి కివీస్ పేలవ బౌలింగే కారణం. కానీ, పాక్ పేస్ అటాక్ వేరు. షాహీన్ అఫ్రిదీ, హారిస్ రవూఫ్, నసీమ్ షా వంటి పేసర్ల ముందు ఏ జట్టు నిలవలేదు. ఇక భారత ఆటగాళ్లను మా బౌలర్లు ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. కాబట్టి వన్డే వరల్డ్ కప్లో ఈ రెండు జట్లు తలపడినా పాక్ గెలిచే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయి. ఒకవేళ పాక్ ముందుగా బ్యాటింగ్ చేసి 300 పరుగులు చేసిందంటే.. భారత ఆటగాళ్లు దాన్ని చేధించడానికి తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది’ అని జావేద్ పేర్కొన్నాడు. కాగా, వరల్డ్ కప్లలో భారత్పై పాకిస్తాన్ ఒకే ఒక్కసారి గెలిచింది. 2021లో యూఏఈ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్లో భారత జట్టు 10 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఆకిబ్ జావెద్ వ్యాఖ్యలపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
The ODI World Cup 2023 will take place in India later this year
Read more: https://t.co/30D3mZXfJ2#GeoSuper #AaqibJaved #ODIWorldCup pic.twitter.com/ytM1HTwq9Y
— Geo Super (@geosupertv) January 30, 2023