ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో సాధారణంగానే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో ఉంటుంది. ఎప్పుడెప్పుడు అధికార పార్టీ ఎండగట్టే అవకాశం దొరుకుతుందా అని ప్రతిపక్ష పార్టీలు చూస్తుంటాయి. ఈ క్రమంలో ఇటీవల ఏపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతి పక్షాలకు ఆయుధంగా దొరికింది. టీడీపీ తో పాటు జనసేన కూడా విద్యుత్ ఛార్జీల పెంపు విషయంలో ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తోంది.
కరెంట్ ఛార్జీల పెంపు పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..” ఒక్కసారి పవర్ ఇవ్వండి..నా పవరేమిటో చూపిస్తా అన్న మాట నిలబెట్టుకుంటూ పవర్ ఛార్జీలు పెంచి అన్నమాట నిలబెట్టుకున్నారు వైసీపీ నేతలు, వైసీపీ ప్రభుత్వం. అధికారంలో కి వస్తే ప్రతి పేద కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామన్న ఈ ప్రభుత్వం 1400 కోట్ల విద్యుత్ భారం పెంచింది. ఇవేకాక ట్రూ అప్ ఛార్జీల పేరుతో మరో 3000 కోట్లు దోచే విధంగా మరో ప్రత్యేకమైన పథక రచన చేసింది. పొద్దున లేస్తే వైసీపీ ప్రభుత్వం ఏఏ టాక్స్ లు విధిస్తోందో అని ప్రజలు భయపడిపోతున్నారు. ప్రభుత్వం తీసుకున్నా ఈ నిర్ణయానికి నిరసనగా అన్ని కలెక్టరేట్లకి వెళ్లి వినతిపత్రలు అందజేస్తాము” అంటూ పవన్ కల్యాణ్ విమర్శించారు.
అప్పుడు మీరు బాదుడే బాదుడు అన్నారు కదా..! ఇప్పుడు మీరు చేస్తున్న పనిని ఏమానాలి? – JanaSena Chief Sri @PawanKalyan pic.twitter.com/z8HT32BCNv
— JanaSena Party (@JanaSenaParty) March 31, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.