ఇటీవల కాలంలో ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాల పట్ల టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్దం జరుగుతున్న విషయం తెలిసిందే. చంద్రబాబు నాయుడి సతీమణి నారా భువనేశ్వరిపై కొందరు వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో భర్త చంద్రబాబు సైతం తీవ్ర మనోవేదనకు గురై మీడియా సాక్షిగా వెక్కి వెక్కి ఏడ్చిన ఘటనలు కూడా మీడియాలో ప్రసారమవ్వడంతో తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.
ఇక వీటన్నిటి పరిణామాల మధ్య స్పందించిన వల్లభనేని వంశీ ఇటీవల నారా భువనేశ్వరికి క్షమాపణలు కోరాడు. ఇదిలా ఉండగా ఇదే విషయంపై తాజాగా స్పందించిన ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై క్షమాపణలు కోరాడు. ఇక టీడీపీ చేపట్టబోతున్న ప్రజా గౌరవ సభల పేరుతో నారా భువనేశ్వరి శీలాన్ని బజారు కీర్చడం బాధాకరమని అన్నారు. ఇదే కాకుండా మాకు విజయమ్మ అయినా నారా భువనేశ్వరి అయిన ఒకటేనని, ఎవరు ఏ మహిళను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన అది తప్పే అవుతుందన్నారు.
ఈ పరిణామాలపై ఇప్పటికైన స్వస్తి పలకాలని కోరారు. మా ఎమ్మెల్యేలు ఎవరైన వారి వ్యాఖ్యలతో మీమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించా, లేకుండా నారా భువనేశ్వరి అనుమతిస్తే.. మా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలంతా కన్నీటితో కాళ్లు కడుగుతామంటూ అని అన్నాడు. తాజాగా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. నారా భువనేశ్వరిపై క్షమాపణలు కోరిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.