రాజకీయాల్లో ఎప్పుడు విమర్శించుకునే నేతలు కూడా అప్పుడప్పుడు.. ఒకరికొకరు ధన్యవాదాలు చెప్పుకుంటారు. తాజాగా కేటీఆర్.. ట్విట్టర్ వేదికగా అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ట్వీట్ వైరలవుతోంది. ఆ వివరాలు..
రాజకీయాలు అంటే ఎప్పుడు విమర్శలే కాదు.. మంచి చేసినప్పడు ప్రశంసలు.. మేలు చేసినప్పుడు కృతజ్ఞతలు కూడా చెప్పాలి. అప్పుడే రాజకీయాల్లో ఆరోగ్యకర వాతావరణం ఉంటుంది. అన్ని పార్టీల ప్రధాన లక్ష్యం ఒక్కటే.. ప్రజా సమస్యలపై పోరాటం, సంక్షేమం. ఇక ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వల్ల సినీ, రాజకీయ సెలబ్రిటీలు సామాన్యులకు చేరువ అవుతున్నారు. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్గా ఉండే రాజకీయ నాయకుల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ముందు వరుసలో ఉంటారు. తాజాగా ఆయన అమిత్ షాను ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ తెగ వైరలవుతోంది. ఇంతకు ఆ ట్వీట్లో ఏముంది అంటే..
మన దగ్గర కేంద్రం నిర్వహించే పోటీ పరీక్షల్లో ఎక్కువ శాతం హిందీ, ఇంగ్లీష్లోనే ఉంటాయి. దాని వల్ల స్థానిక అభ్యర్థులు నష్టపోతున్నారు. ఈ క్రమంలో తాజాగా సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అయితే ఈ పరీక్ష కేవలం హిందీ, ఇంగ్లీష్లోనే ఉండటంతో.. అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో కేటీఆర్.. సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగాల పరీక్షను ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని డిమాండ్ చేస్తూ.. కేంద్రానికి లేఖ రాశారు. కేటీఆర్ డిమాండ్పై కేంద్ర సానుకూలంగా స్పందించింది. హిందీ, ఇంగ్లీష్ భాషలతో పాటు మరో 13 ఇతర ప్రాంతీయ భాషల్లోనూ ఆ పరీక్షలను నిర్వహించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లోనూ పరీక్షలను నిర్వహించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
సీఆర్పీఎఫ్ పరీక్షలను హిందీ, ఇంగ్లీష్తో పాటు.. తెలుగు, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, మలయాళం, కన్నడ, తమిళం, ఒడియా, ఉర్దూ, పంజాబీ, మణిపురి, కొంకణి భాషల్లో నిర్వహిస్తామని తెలిపింది. 2024 జనవరి 1 నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొన్నది. కేంద్రం ప్రకటనపై స్పందిస్తూ.. మంత్రి కేటీఆర్.. ట్విట్టర్ వేదికగా అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రకటనపై హర్షం చేయడమే కాక.. కేటీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు నిరుద్యోగ అభ్యర్థులు. మరి కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల నిరుద్యోగులకు మేలు కలుగుతుందని భావిస్తున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
I thank HM @AmitShah Ji for agreeing to conduct the CRPF examination in 13 regional languages including Telugu
This will surely help thousands of aspirants from Telugu speaking states https://t.co/Vxg8QtHPCC
— KTR (@KTRBRS) April 15, 2023