బుల్లితెర డెస్క్- జబర్దస్త్.. ఈ బుల్లితెర కామోడీ షోకు యాంకర్లు రష్మి, అనసూయ ఇద్దరూ రెండు కళ్లు అని చెప్పవచ్చు. ఎందుకంటే జబర్దస్త్ లో కంటెస్టెంట్స్ ఎన్ని స్కిట్స్ చేసి నవ్విస్తే, రష్మి, అనసూయ అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు. ఇక కుర్ర కారు గుండెల్లో అనసూయ, రష్మి గుబులుపుట్టిస్తారన్నది వేరే చెప్పక్కర్లేదు. అందుకే జబర్దస్త్ కు అనసూయ, రష్మి ప్రధాన ఆకర్షణ అని చెప్పకతప్పదు.
ఇక జబర్దస్త్ షోకు అనసూయ, ఎక్స్ ట్రా జబర్దస్త్ షో కు రష్మి యాంకరింగ్ చేస్తున్నారు. ఇద్దరూ ఒకరిని మించి మరొకరు షోను హోస్ట్ చేస్తున్నారు. వీరిద్దరు లేని జబర్దస్త్ ను అస్సలు ఊహించుకోలేము. ఇక జబర్దస్త్ షో నిర్మాణ సంస్థ మల్లెమాల తరపున గతంలో మేనేజర్ గా పనిచేసిన ఏడుకొండలు తెలుసు కదా. జబర్దస్త్ షో కాంటెస్టెంట్స్, జడ్జిలు, యాంకర్లు, సాంకేతిక నిపుణులందరికి ఏడుకొండలే పేమెంట్స్ ఇచ్చేవారు. అందుకే ఆయనకు జబర్దస్త్ లోని అందరి గురించి బాగా తెలుసు.
ఇక జబర్దస్త్ మేనేజర్ ఏడుకొండలు యాంకర్స్ రష్మి, అనసూయ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ రెండూ ప్రత్యేకమే అన్న ఆయన, ఇద్దరు యాంకర్లు బాగా చేస్తారని చెప్పారు. రష్మికి, అనసూయకు మంచి రేటింగ్స్ వస్తాయని చెప్పుకొచ్చారు.
అనసూయ అయితే తెలుగు అమ్మాయి కాబట్టి తెలుగు బాగా మాట్లాడుతుందన్న ఏడుకొండలు, రష్మి ఒరిస్సా అమ్మాయి కావడంతో తెలుగు వచ్చీరానట్టుగా మాట్లాడినా అదే ప్రేక్షకులకు బాగా నచ్చిందని చెప్పారు. అంతే కాదు గతంలో ఓ సారి పేమెంట్స్ విషయంలో మనస్పర్ధలు వచ్చి అనసూయ కొన్ని రోజులు జబర్దస్త్ షో నుంచి తప్పుకుందని జరిగిన ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని ఏడుకొండలు తెలిపారు.
జబర్దస్త్ షోకు పనిచేసే వారందరికి ఎంత చెప్పామో అంత పేమెంట్ ఇస్తామని, రెమ్యునరేషన్ విషయంలో గొడవలు ఎప్పుడూ రాలేదని ఆయన స్పష్టం చేశారు. ఐతే జబర్దస్త్ షో నుంచి ఏడుకొండలు ఎందుకు తప్పుకున్నారన్నది మాత్రం చెప్పలేదు.