తన హాస్యంతో అందరిని కడుపుబ్బా నవ్వించే ముక్కు అవినాశ్ తల్లి అనారోగ్యానికి గురైంది. దీంతో అవినాశ్ కంటతడిపెట్టుకున్నాడు. తన కొడుకులే తనని బతికించారంటూ తల్లి కన్నీటి పర్యాంతమైంది.
జబర్థస్త్ షో ద్వారా మంచి పేరు సంపాదించుకున్న ప్రముఖ కమెడియన్ ముక్కు అవినాశ్ తల్లి మల్లమ్మ ఆస్వస్థతకు గురైయింది. ఆనారోగ్యంతో బాధపడుతున్నా తన తల్లిని ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు గుండెపోటుకు గురైనట్లు వెల్లడించారు. గుండెలో బ్లాక్స్ ఉండంతో వైద్యులు స్టంట్స్ వేశారు. తాజాగా ఒక వీడియోను ముక్కు అవినాశ్ తన య్యూట్యూబ్ చానల్ లో రిలీజ్ చేశాడు, తను మాట్లాడుతూ.. ఎప్పుడు నవ్వుతూ ఉండే మా అమ్మ ఇలా బాధపడుతుంటే చూడలేకపోతున్నా. అమ్మకు షూగర్ వ్యాది ఉంది. దాని వల్ల ఇష్టమైన ఆహారం తినలేకపోతుంది.
3 రోజుల క్రితం అమ్మకు గుండె పోటు వచ్చింది. అమ్మను ఊరిలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్తే గుండె వీక్ ఉందని డాక్టర్స్ చెప్పడంతో ఏ మాత్రం లేట్ చేయకుండా హైదారాబాద్ తిసుకువచ్చాను. గుండెలో రెండు పెద్ద బ్లాక్స్ ఏర్పడ్డాయి. ఆంజియేగ్రామ్స్ చేయించాం, రెండు స్టంట్స్ వేయించాం. అమ్మని ఇప్పుడు ఇంకా జగ్రత్తగా చూసుకోవాలి అని తన వీడియోలో చెప్పుకొచ్చాడు. తనకు వచ్చిన పరిస్థితి తలుచుకుని అవినాశ్ తల్లి కంటతడి పెట్టుకుంది. నా కొడుకులు లేకుంటే ఈ రోజు నేను ప్రాణాలతో ఉండేదాన్ని కాదు అని, నా పెద్ద కొడుకు లెకపోయుంటే ఊరిలోనే నా ప్రాణాలు పోయేవని సమాయానికి అస్పత్రికి తీసుకెళ్లడం వల్లనే నేను బ్రతికాను అంటూ ఏడ్చేసింది. కొద్ది రోజలు అస్పత్రిలో చికిత్స తీసుకున్న తరువాత అవినాశ్ తల్లిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్లాడు.