ఫిల్మ్ డెస్క్- కరోనా నేపధ్యంలో యేడాదిన్నర కాలంగా దేశంలో థియేటర్స్ అన్నీ మూతపడ్డాయి. కొవిడ్ మొదటి వేవ్ తరువాత రెండు మూడు నెలలు సినిమా హాల్స్ ఓపెన్ అయ్యాయి. మళ్లీ కరోనా సెకండ్ వేవ్ ప్రభలడంతో ధియోటర్స్ మరోసారి బంద్ అయ్యాయి. ఇక ఇప్పుడు క్రమంగా కరోనా కేసులు తగ్గిపోవడంతో పరిస్థితులు చక్కబడుతున్నాయి. దీంతో పెండింగ్లో ఉన్న సినిమాలన్నీ విడుదలకు సిద్దమవుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకుని రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న సినిమాలన్నీ ధియోటర్స్ ఏపెనింగ్ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నాయి.
ఈ క్రమంలో కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ భారీ సినిమా కేజీఎఫ్-2 విడుదలకు సిద్దమవుతోంది. యష్ హీరోగా నటించిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండటంతో రిలీజ్ కోసం సన్నాహాలు చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే కేజీఎఫ్-2 షూటింగ్ ఫినిష్ చేసిన చిత్ర యూనిట్, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమైంది. హీరో యష్ డబ్బింగ్ స్టార్ట్ చేప్పేస్తున్నారట. అందుకని ఇక సినిమా విడుదల విషయంలో ఏ మాత్రం ఆలస్యం చేయొద్దని భావిస్తున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్, జులై నెలలో ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించాలని ఫిక్సయినట్లు కన్నడ ఫిల్మ్్ వర్గాలు చెబుతున్నాయి.
అన్నీ కుదిరితే కేజీఎఫ్-2 సినిమాను సెప్టెంబర్ నెలలో విడుదల చేయాలని భావిస్తున్నారట. పరిస్థితుల ప్రభావంతో అది కుదరకపోతే డిసెంబర్లో క్రిస్మస్ సందర్భంగా కేజీఎఫ్-2 సినిమాను విడుదల చేయడానికి ప్రణాళిక సిద్దం చేస్తున్నారని సమాచారం. వాస్తవంగా జూలై 16న ప్రపంచ వ్యాప్తంగా కేజీఎఫ్-2 విడుదల కావాల్సి ఉంది. ఈ మేరకు మూవీ యూనిట్ ప్రకటన కూడా తేసింది. అప్పుుడు యష్ ఫ్యాన్స్ ఆ డేట్పై దృష్టి పెట్టారు. తొలి రోజే ఎలాగైనా సినిమా చూసేయాలనే కోరికతో ఆ రోజును జాతీయ సెలవు దినంగా ప్రకటించాలంటూ ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు.
అయితే కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల నేపధ్యంలో ఆ డేట్లో రిలీజ్ చేయడం కుదరడం లేదట. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కాబోతున్న కేజీఎఫ్-2 ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్ బ్యానర్పై భారీ బడ్జెట్ కేటాయించి రూపొందిస్తున్నారు. చిత్రంలో యష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. సంజయ్ దత్ విలన్గా నటిస్తుండగా, సీనియర్ హీరోయిన్ రవీనాటాండన్ కీలక పాత్ర పోషిస్తోంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.