జపాన్ వేదికగా సాగుతోన్న ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్ లో భారత మహిళా హాకీ జట్టు అద్భుతమైన పోరాట పటిమతో సెమీస్ చేరిన విషయం తెలిసిందే. అయితే.., ఈ బుధవారం జరిగిన సెమీస్ లో రాణి రాంపాల్ సారథ్యంలోని భారత్ మహిళల హాకీ జట్టు 2-1 గోల్స్ తేడాతో అర్జెంటీనా చేతిలో ఓడిపోయింది. నిజానికి ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ లో మొదటిగా ఖాతా తెరిచింది ఇండియానే. తొలి 2 నిమిషాల్లోనే గుర్జీత్ కౌర్ భారత్ కు గోల్ అందించింది. దీంతో తొలి క్వార్టర్ భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ.., రెండో క్వార్టర్ నుండి మ్యాచ్ స్వరూపం మారిపోయింది.
రెండో క్వార్టర్ మొదలవ్వగానే అర్జెంటీనా దూకుడు పెంచి.., తన ఖాతాను తెరిచి స్కోరును సమం చేసింది. చివరిలో అర్జెంటీనా మరో గోల్ సాధించడంతో భారత జట్టుకి ఓటమి తప్పలేదు. కానీ.., బలమైన అర్జెంటీనా జట్టుతో భారత మహిళా హాకీ జట్టు పోరాడిన తీరు మాత్రం అందరిని ఆకట్టుకుంది. ఇక ఈ ఓటమితో భారత మహిళా హాకీ జట్టు కాంస్య పతకం కోసం పోరాడాల్సి వచ్చింది. ఈ ఒక్క మ్యాచ్ లో గనుక నెగ్గితే.. ఇండియాకి కాంస్య పతకం దక్కుతుంది. మరి.. ఈ కోరిక అయినా నెరవేరుతుందో లేదో చూడాలి.