దేశంలో గత కొంత కాలంగా రోడ్డు ప్రమాదల సంఖ్య పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు.. అంగవైకల్యంతో బాధపడుతున్నారు. ఎవరో చేసిన నిర్లక్ష్యానికి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లాలో మోక్షగుండం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
ఇది చదవండి: మాల్ దొరికింది.. పుష్ప కూడా దొరికాడు: యూపీ పోలీస్
లారీ-బొలేరో వాహనం ఢీకొని నలుగురు దుర్మరణం పాలయ్యారు. బేస్తవారిపేట మండలం పెంచికలపాడు గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరొకరు తీవ్రంగా గాయపడగా.. గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఆరు కోడె దూడలు కూడా మృతిచెందినట్లు తెలిస్తోంది. ఘటన స్థలిలో దృశ్యాలు బీభత్సంగా ఉన్నాయి. రెండు వాహనాలు వేగంగా వస్తుండడంతో ఇంజిన్ క్యాబిన్లు నుజ్జునుజ్జయ్యాయి. ఈ ఘటనలో వ్యక్తులతో పాటు మూగ జీవాలు కూడా మరణించడం కలచివేసింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, మృతులకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.