తీన్మార్ మల్లన్న.. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేరు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై, ఆ పార్టీ నాయకులపై విమర్శలు చేస్తూ మల్లన్న నిత్యం హైలెట్ అవుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మల్లన్న పై వరుసగా కేసులు కూడా నమోదు అవుతూ వస్తున్నాయి. ఇక తాజాగా.. ప్రముఖ జ్యోతిష్యుడు లక్ష్మీకాంత్ శర్మను డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేశాడన్న ఆరోపణలతో తీన్మార్ మల్లన్న..అలియాస్ చింతపండు నవీన్ను చిలకలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు.
కేసు విచారణ కోసం.. కోర్టు మల్లన్నకి సెప్టెంబర్ 9 వరకు రిమాండ్ విధించింది. తరువాత.. మల్లన్న భార్య బెయిల్ పిటిషన్ వేయడం, కోర్టు దాన్ని తోసిపుచ్చడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే.., మల్లన్న మూడేళ్ళ కూతురు తండ్రి మీద బెంగతో అనారోగ్యానికి గురై.., ఐసీయూలో జాయిన్ అవ్వడం ఇప్పుడు అందరిని కలచి వేస్తోంది.
తీన్మార్ మల్లన్న కూతురి ఆరోగ్యం ముందు నుండి అంతగా బాగోదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇక ఆగస్ట్ 27న మల్లన్నని పోలీసులు అరెస్ట్ చేసిన తరువాత నుండి చిన్నారి తండ్రిపై బెంగ పెట్టుకున్నట్టు బంధువులు తెలియచేశారు. ” పాపకి వాళ్ళ నాన్నతో అటాచ్మెంట్ ఎక్కువ. రోజులో ఒక్కసారైనా ఆయన్ని చూడందే ఆమె అన్నం ముట్టదు. ఇన్ని రోజులుగా తండ్రి కనిపించకపోవడంతో తను ఆహరం తీసుకోవడం మానేసింది. ఆయనపై కేసులు పెట్టి, బెయిల్ కూడా రాకుండా చేస్తున్నారు” అంటూ మల్లన్న భార్య ఎమోషనల్ అవుతూ.. తమ బాధని సుమన్ టీవీకి చెప్పుకుంది. అయితే.. ఈ విషయంలో రాజకీయ కోణాలను పక్కన పెడితే హాస్పిటల్ లో పాప పడుతున్న బాధ మాత్రం అందరిని కలచి వేస్తోంది. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.