అఫ్ఘానిస్తాన్లో తాలిబన్ల అరాచకాలు రోజు రోజుకు మితి మీరుతున్నాయి. ఇప్పటికే దేశాన్ని తమ ఆదీనంలోకి తీసుకున్న తాలిబన్లు హల్చల్ చేస్తున్నారు. తాలిబన్లు రాజదాని కాబుల్ మినహా అంతా వాలిపోవటంతో ఆ దేశ పౌరులు భయంతో వణికిపోతున్నారు. గతంలో వారి పరిపాలనలో ఎన్నో దారుణాలు జరిగాయని దాని కారణంగానే ఇక్కడ నుంచి ఇతర దేశాలకు వెళ్తున్నామని ఆ దేశ ప్రజలు ఆవేదన తెలియజేస్తున్నారు.
అయితే తాలిబన్ల పరిపాలన, వారి నిజస్వరూపాల గురుంచి సంచలన నిజాలు బయటపెట్టాడు ఆ దేశ మాజీ జడ్జి అయుబి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తాలిబన్ల పరిపాలనో ఎన్నో విస్తుపోయే నిజాలు ఉన్నాయని అన్నారు. వారి దారుణాలు చూడలేకే ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పక్క దేశాల చూపు చూస్తున్నారని ఆయన తెలిపారు.
ఇక మహిళలనైతే అతి హీనంగా హింసిస్తున్నారని, ఆహారం సరిగ్గా వండలేదని ఓ మహిళను అక్కడే నిప్పు పెట్టి చంపారంటూ ఆయన తెలిపారు. ఇవే కాకుండా అక్కడి యువతులను జిహాదీలతో పెళ్లిల్లు చేసుకోవాలంటూ బలవంతం చేస్తున్నారని ఆయన బయటపెట్టారు. దీంతో పాటు మహిళలను శవపేటికల్లో పెట్టి ఇతర దేశాలకు తరలించి సెక్స్ బానిసలుగా మారుస్తున్నారని మాజీ జడ్జి అయుబి తన ఆవేదనను వెళ్లగక్కారు.