వచ్చే మూడు నెలల్లో పండుగలే పండుగలు. దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి.. ఇలా చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి. మరి ఇన్ని ఉన్నాయంటే ప్రజలు కచ్చితంగా సొంతూళ్లకు వెళ్తారు. దీంతో రైళ్లలో రద్దీ పెరుగుతుంది. రిజర్వేషన్ చేసుకుంటే సరేసరి.. లేదంటే స్పెషల్ ట్రైన్స్ లో టికెట్ దక్కించుకోవాలి. అందుకోసం సాధారణంగా ఉండే ధర కంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది! దీనికి తోడు ప్రజలపై ఇప్పుడు మరో భారం వేసింది దక్షిణాది రైల్వే. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన పండుగల సమయాల్లో సొంతూళ్లకు పయనమవుతారు. బతుకమ్మ, దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి పండుగలని సెలబ్రేట్ చేసుకుంటారు. బస్సు, విమాన ప్రయాణాలు ఖర్చుతో కూడుకున్నవి కాబట్టి రైలు ప్రయాణాలనే ఆశ్రయిస్తారు. ఇప్పటికే అందుకు సంబంధించిన చాలా వరకు బుక్ అయిపోయాయి. రిజర్వేషన్స్ లో వెయిటింగ్ లిస్టులు కనిపిస్తున్నాయి. ఇక దీనికి తోడు స్టేషన్ కి వచ్చి, తమ వారిని సాగనంపేవారు కూడా చాలామంది ఉంటారు. ఫెస్టివల్ స్పెషల్ పేరుతో వారిపైనా భారం వేసేందుకు దక్షిణాది రైల్వే సిద్ధమైంది.
The platform ticket fare has been raised from Rs 10 to Rs 20 per person from October 1st to January 31st 2023, to avoid overcrowding during festival time: Southern Railway. pic.twitter.com/lVQ0rNLuMu
— ANI (@ANI) September 29, 2022
దీని ప్రకారం చెన్నై పరిసరాల్లోని ఎనిమిది ప్రధాన స్టేషన్స్ లో ఫ్లాట్ ఫామ్ టికెట్ రేట్స్ ని రూ.10 నుంచి రూ.20కి పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇది రాబోయే నాలుగు నెలలు అంటే అక్టోబరు 1 నుంచి జనవరి 31 వరకు అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. స్టేషన్ లో ప్రయాణికుల రద్దీ తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని సౌత్ సెంట్రల్ రైల్వే చెప్పింది. ఇప్పటికే దసరా సందర్భంగా తెలంగాణలోని కాచిగూడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫాం టికెట్ ధరలను పెంచింది. అక్టోబర్ 9 వరకు ఈ రేట్స్ అమలు చేయనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. మరి ఫ్లాట్ ఫామ్ టికెట్ ధరల పెంపుపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.