మనుషుల్ని కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు మాత్రమే కాదు అనారోగ్య సమస్యలు కూడా కుంగదీస్తాయి. చిన్న జ్వరానికి బ్రతుకు మీద విరక్తి కలుగుతుంది. ఇక పెద్ద సమస్యలు వస్తే చనిపోవాలన్న ఆలోచన వస్తుంది. ముఖ్యంగా యువత ఆత్మ స్థైర్యాన్ని కోల్పోతున్నారు.
మనుషుల్ని కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు మాత్రమే కాదు అనారోగ్య సమస్యలు కూడా కుంగదీస్తాయి. చిన్న జ్వరానికి బ్రతుకు మీద విరక్తి కలుగుతుంది. ఇక పెద్ద సమస్యలు వస్తే చనిపోవాలన్న ఆలోచన వస్తుంది. ముఖ్యంగా యువత ఆత్మ స్థైర్యాన్ని కోల్పోతున్నారు. ప్రతి సమస్యకు చావు పరిష్కారం కాదు. ఒడ్డున ఉండి ఎన్ని మాటలు అయినా చెబుతాం, పడేవాడికి తెలుస్తుంది ఆ బాధ అనుకోవచ్చు. కానీ చిన్న చిన్న ఇబ్బందులు, బాధలకు, సమస్యలకు ఆత్మహత్యలతో ఫుల్ స్టాప్ పెట్టడం సరికాదు. ఓ యువతి అనారోగ్య సమస్యలను తట్టుకోలేక తల్లిదండ్రులకు కడుపు కోత పెట్టి తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఆమె నిర్ణయంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.
వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట రూరల్ మండల పరిధిలోని రాఘవాపూర్ గ్రామానికి చెందిన శర్వాణి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శర్వాణికి నెల రోజుల క్రితం 24 గంటల కడుపులో నొప్పి రాగా, అపెండిసైటిస్ ఆపరేషన్ చేయించారు తల్లిదండ్రులు. ఆపరేషన్ తర్వాత కూడా కడుపులో నొప్పిగా ఉందని చెప్పడంతో ఆసుపత్రిలో చేర్పించి.. కాస్త ఉపశమనం కలగగానే ఇంటికి తెచ్చారు. అయినా మళ్లీ నొప్పి రావడంతో.. భరించలేక నిద్రమాత్రలు, ఇంకొన్ని టాబ్లెట్స్ మింగేసింది. అపస్మారక స్థితిలోకి జారిపోతున్న సమయంలో కుటుంబ సభ్యులు గమనించి.. సిద్ధిపేటలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో.. సికింద్రాబాద్ యశోదకు తరలిస్తుండగానే మార్గమధ్యంలోకన్నుమూసింది. ఇదే విషయాన్ని వైద్యులు నిర్ధారించారు.