దాసరి నారాయణరావు.. తెలుగు సినిమాకి స్వర్ణయుగం ఎలా ఉంటుందో చూపించిన దర్శక రత్న. ఆయన వారసులు మాత్రం ఆ లెగసీ ని కంటిన్యూ చేయలేకపోయారు. రీల్ లైఫ్ లోనే కాదు.., రియల్ లైఫ్ లో కూడా వారి కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా.. దాసరి తనయుడు దాసరి అరుణ్ కుమార్ బంజారాహిల్స్ పీఎస్ లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. నర్సింహులు అనే వ్యక్తి పాత సినిమాల రిస్టోరేషన్ టెక్నీషియన్. దాసరి గారికి నర్సింహులుపై మంచి గురి. 2012నుంచి 2016వరకూ నర్సింహులు దాసరి వద్ద ఔట్సోర్సింగ్ పద్ధతిలో పని చేశాడు. అప్పుడు దాసరి నారాయణరావు నర్సింహులకి రావాల్సిన డబ్బు సకాలంలో చెల్లిస్తూ వచ్చాడు. కానీ.., దాసరి అకాల మరణం తరువాత జరిగిన పనులుకు రావాల్సిన డబ్బులు బకాయి పడిపోయాయి.
ఈ విషయంలో నర్సింహులు.. దాసరి ఇద్దరు కుమారులను పలుమార్లు కలుసుకున్నట్టు తెలుస్తోంది. అయితే.., ప్రభు, అరుణ్ కుమార్ ల మధ్య గొడవలు మొదలవ్వడంతో నర్సింహులకి రావాల్సిన డబ్బులు కూడా ఆగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఈనెల 13 తేదీన నర్సింహులు ఫిలింనగర్లోని ఎఫ్ఎన్సీసీ దగ్గర దాసరి అరుణ్ కుమార్ ని కలుసుకున్నాడు. ఆ సమయంలో దాసరి అరుణ్ తనను కులం పేరుతో దూషించాడని నర్సింహులు ఆరోపిస్తున్నాడు. దీంతో.., అరుణ్ పై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. ఒకప్పుడు ఇండస్ట్రీ మొత్తానికి మంచి, చెడు చెప్పిన దాసరి నారాయణరావు కుటుంబానికి.. ఈరోజు ఈ పరిస్థితి రావడం నిజంగా విచారించతగ్గ విషయం. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.