మీరు ఎక్కువుగా ఫోన్ ని కాలింగ్ కోసమే ఉపయోగిస్తుంటారా..? అయితే, ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే. ప్రెస్టేజ్ కోసం స్మార్ట్ ఫోన్లు కొని అధిక రీఛార్జ్ ధరల భారాన్ని భరించడం కంటే, జియో ఫీచర్ ఫోన్ కొని ఆ భారాన్ని సగానికిపైగా తగ్గించుకోవచ్చు. ఎలా..? అన్నది తెలుసుకోవాలంటే కింద చదవండి.
‘రిలయన్స్ జియో‘ దేశంలోనే అగ్రగామి టెలికాం సంస్థ. అత్యధిక యూజర్లను కలిగిన సంస్థ. ‘జియో’ రాకతోనే దేశంలో ఇంటర్నెట్ వినియోగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయన్నది వాస్తవం. అప్పటివరకు నెల మొత్తం 1జీబీ డేటాతో సరిపెట్టుకునే యూజర్లు, ఇప్పుడు రోజుకు 2జీబీ డేటా సరిపొవట్లేదంటున్నారు. మొబైల్ రీఛార్జిల భారాన్ని జియో అంత చౌకగా మార్చేసింది. అనంతరం కాలం గడిచే కొద్దీ స్మార్ట్ ఫోన్ ఉన్న అనుభవాలను ఫీచర్ ఫోన్ లో కూడా కల్పించాలనే ఉద్దేశ్యంతో అతి తక్కువ ధరకే జియో ఫోన్ ను అందుబాటులోకి తెచ్చింది.
జియో ఫోన్ రీఛార్జ్ ధరలను సాధారణ స్మార్ట్ ఫోన్ ధరలతో పోల్చితే దాదాపు 70శాతానికి పైగా తక్కువ. రూ. 895కే 336 రోజుల పాటు న్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, ప్రతి 28 రోజులకు ఒకసారి 2జీబీ డేటా, 50 ఎస్ఎంఎస్ ల ప్రయోజనాన్ని అందిస్తోంది. ఈ జియో ఫోన్ రీఛార్జ్ ధరలలో అతి చౌకైనది.. రూ. 91 ప్లాన్. ఈ ప్లాన్ వ్యాలిడిటీ ఎన్ని రోజులు..? ప్రయోజనాలు ఏంటి..? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. ఈ 28 రోజులు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్ పొందవచ్చు. మొత్తం 3జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 100 ఎంబీ డేటా చొప్పున వినియోగించుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు ప్రతి రోజూ 200 ఎంబి అదనపు డేటా లభిస్తుంది. ఈ విధంగా, కస్టమర్ మొత్తం 28 రోజుల్లో 3జీబీ + 200ఎంబి డేటాను ఉపయోగించవచ్చు. డేటా పరిమితి ముగిసిన తర్వాత, వినియోగదారులు 64 kbps వేగంతో ఇంటర్నెట్ పొందుతారు. అదే సమయంలో, ఈ ప్లాన్లో మొత్తం 50 ఎస్ఎంఎస్ లు కూడా అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ జియో క్లౌడ్ వంటి జియో కాంప్లిమెంటరీ యాప్లను యాక్సెస్ చేసుకోవచ్చు.