ఫిల్మ్ డెస్క్- యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజా సినిమా రాధే శ్యామ్ విడుదలకు ముస్తాబవుతోంది. కరోనా కారణంగా ఎప్పటికప్పుడు షూటింగ్ వాయిదా పడుతూ రావడంతో కాస్త ఆలస్యంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. దీంతో రాధే శ్యామ్ పాన్ ఇండియా సినిమాను ఈ సంక్రాతి పండగ సందర్బంగా జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
ఈ క్రమంలో రాధే శ్యామ్ సినిమా ప్రోషన్స్ పై మేకర్స్ దృష్టి సారించారు. అందులో ప్రధానంగా ప్రీరిలీజ్ వేడుక ఘనంగా నిర్వహించాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైంది. రాధే శ్యామ్ ప్రీరిలీజ్ వేడుకకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. డిసెంబర్ 23న రాధే శ్యామ్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారని తెలుస్తోంది.
రామోజీ ఫిల్మ్ సిటీలో రాధే శ్యామ్ ప్రీరిలీజ్ వేడుక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. అట్టహాసంగా ఈ ఈవెంట్ ను జరిపిేందుకు భారీగా అరెంజ్ మెంట్స్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక రాధే శ్యామ్ ప్రీరిలీజ్ వేడుకకు ముఖ్య అతిధిగా ఎవరు వస్తారన్నదానిపై కూడా టాలీవుడ్ లో ఆసక్తి నెలకొంది. రెబల్ స్టార్ కృష్ణంరాజుతో పాటు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా వచ్చే అవకాసం ఉందని సమాచారం.
జిల్ మూవీ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కింది రాధే శ్యామ్. బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్. ఈ భారీ బడ్జెట్ మూవీని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ పాన్ ఇండియన్ సినిమాను మొత్తం 7 భాషలలో భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ ఫిల్మ్స్ కలిసి భారీ బడ్జెట్తో నిర్మించారు. జనవరి 14న విడుదల అవుతున్న రాధే శ్యామ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.