కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణంతో కన్నడ ఇండస్ట్రీనే కాదు.. యావత్ ప్రజానీకం కన్నీరు పెట్టుకుంది. నటుడిగానే కాదు సామాజిక కార్యకర్తగా కూడా తనదైన ముద్ర వేశారు. ఆయన మరణంతో కుటుంబ సభ్యులు, అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఇక కుటుంబ సభ్యులు ఆవేదన వర్ణనాతీతం.. తమ మధ్య నవ్వుతూ సంతోషంగా తిరిగిన తమ ఇంటి సభ్యులు లేడు, ఇక తిరిగి రాడు అన్న విషయాన్నీ వారు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ రాజ్ కుమార్ మరణం తర్వాత ఆయన సోదరుడు శివ రాజ్ కుమార్ ఓ ఛానల్ కి ఇంటర్వ్యూలో ఇచ్చారు.
ఈ సందర్భంగా తన తమ్ముడిని గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ గురించి శివ రాజ్ కుమార్ ప్రస్తావించారు. తన తమ్ముడు మరణించినప్పుడు యన్టీఆర్ నా దగ్గరకు వచ్చి.. అన్నా నేను మీకు ఉన్నా అంటూ దైర్యం చెప్పారు. యన్టీఆర్-పునీత్ మంచి స్నేహితులే కాదు.. అన్నదమ్ముల్లా ఉండేవారని అన్నారు. తమ కుటుంబానికి ఎన్టీఆర్ కు ఉన్న అనుబంధం గురించి శివరాజ్ కుమార్ తెలియజేశారు.
పునీత్ రాజ్ కుమార్ కన్నుమూసిన తర్వాత వారి కుటుంబానికి దగ్గరగా ఉంటూ వచ్చిన యన్టీఆర్ వెళ్లి ఓదార్చిన విషయం తెలిసిందే. ఇక పునీత్ రాజ్ కుమార్ నటించిన చక్రవ్యూహ కోసం యన్టీఆర్ ‘గెలయా గెలయా’ అనే పాటను పాడారు. అప్పట్లో ఈ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే సీనియర్ ఎన్టీఆర్ ల తరం నుంచి రాజ్ కుమార్ కుటుంబ సభ్యులతో మంచి రేలేషన్ కొనసాగుతూనే ఉంది. నందమూరి బాలకృష్ణకి కూడా శివ రాజ్ కుమార్ తో మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి.
“నేనున్నాను అన్నా మీకు” – ఎన్.టి.ఆర్
శివరాజ్ కుమార్ @NimmaShivanna
గారిని పరామర్శించిన ఎన్.టి.ఆర్@tarak9999 @PuneethRajkumar pic.twitter.com/Qijeqlagc9— MilagRRRo Movies (@MilagroMovies) November 11, 2021