తాజాగా వెబ్ సిరీస్ల విషయంలో ఎవరి నోట విన్నా స్క్విడ్ గేమ్ అనే పేరే వినిపిస్తోంది. ఓటీటీ సెన్సేషన్గా నిలిచింది స్క్విడ్ గేమ్. ఈ వెబ్ సిరీస్ను 142 మిలియన్ల మంది చూసినట్లు నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. అంతేకాదు ఈ వెబ్ సిరీస్ వల్ల తమకు 4.3 మిలియన్స్ సబ్స్క్రైబర్లు పెరిగినట్లు కూడా తెలిపింది. అప్పులు బాధల్లో కొట్టుమిట్టాడుతున్న 456 మందిని ఒక ప్రత్యేక ప్రదేశంలోకి ఆహ్వానించి వారికి పోటీ నిర్వహిస్తారు. చూడటానికి చిన్న పిల్లలు ఆడుకునే ఆటలే అయినా చిన్న పొరపాటు చేస్తే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. మొత్తం ఆరు గేమ్లు ఆడి విజేతగా నిలిచిన వారికి 38 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ ఇస్తారు. అందుకోసం ఆశపడి ప్రాణాలను పణంగా పెట్టి వెళ్లి ఎందరో ప్రాణాలు కోల్పోతారు.
ఇదీ చదవండి: సెక్యూరిటీ గార్డ్ కొడుకు కోటీశ్వరుడయ్యాడు.. అమితాబ్ నే ఆశ్చర్యపరిచిన కంటెస్టెంట్..
అయితే ఈ గేమ్లో చూపింతే పరిస్థితులే సౌత్ కొరియాలో కనిపిస్తాయంటూ నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. అంటే నిజంగానే స్క్విడ్ గేమ్ ఆడిస్తున్నారని కాదు. అందులో ఎలా అయితే అప్పుల పాలవుతూ బతకే భారంగా కాలం వెళ్లదీస్తున్నారో అలాంటి వారు సౌత్ కొరియాలో కోకొల్లలు అంటున్నారు. అప్పులు తిరిగి చెల్లించే సమయంలో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా.. లొసుగుల సాయంతో ముప్పు తిప్పలు పెడతారు. అసలు అక్కడ అప్పు చేయడం అంటేనే పెద్ద నేరంగా భావిస్తారు. చేసిన అప్పు తీర్చడం కంటే చనిపోవడమే మేలు అంటుంటారు వారు. కానీ, కాలం మారుతున్న కొద్దీ ఆ దేశంలో అప్పులు పెరుగుతూనే ఉన్నాయి. 2021లో ఆ దేశంలో అప్పులు 55 శాతానికి చేరాయి. అక్కడ దివాళా తీసిన వారైతే 50 వేలు పైచిలుకే అని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అక్కడ బ్యాంకులు, ప్రభుత్వ సహకార గ్రూపుల ఆధిపత్యమే కనిపిస్తుంది
అక్కడి వ్యవస్థలు అప్పు చేసిన వాడిని పెట్టే బాధలు అన్నీ ఇన్నీ కాదు. వారి టార్చర్ తట్టుకోవడం కంటే చావడమే మేలనే నిర్ణయానికి వస్తున్నారు అక్కడి ప్రజలు. అక్కడ ఇంకో దారుణమైన చట్టం ఒకటి ఉంది. అందరూ ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. జాయింట్ షూరిటీ విధానం కూడా తీసుకొచ్చారు. అంటే అప్పు చేసిన వ్యక్తి చనిపోతే రెండో వ్యక్తిని పీడించుంకు తింటారన మాట. అలా వారికి నచ్చినట్లు చట్టాన్ని కూడా మార్చుకున్నాయి బ్యాంకులు. నిజ జీవితంలోని వాస్తవ పరిస్థితుల ఆధారంగానే ఈ వెబ్ సిరీస్ తీశానని డైరెక్టర్ వాంగ్ డోంగ్ హ్యూక్ ప్రకటించిన విషయం తెలిసిందే. అక్కడి పరిస్థితులను చూసి విసిగిపోయే అక్కడి విషయాలను సమాజానికి తెలిసేలా చెప్పాలనే డైరెక్టర్ ఇలా ప్రయత్నించాడు అని కూడా సోషల్ టాక్ మొదలైంది.