సాధారణంగా వర్షాకలంలో ఎక్కువ శాతం దొమలు, ఈగల బెడద ఎక్కువగా ఉంటుంది. అపరిశ్రుభమైన ప్రాంతాల్లో ఎక్కుడగా ఈగలు వాలుతుంటాయి. ఇళ్లలో ఈగలు చూస్తుంటే చాలా ఇరిటేషన్ గా ఉంటుంది.
కొన్ని సార్లు చిన్న చిన్న జీవుల వల్ల మనకు ప్రమాదం పొంచి ఉంటుంది. ఈగలు, దొమలు, చీమలు ఇవి చూడటానికి చిన్నగా ఉన్నా.. ఇవి పెట్టే ఇబ్బందులు మామూలుగా ఉండవు. ఇటీవల కొన్ని గ్రామాల్లో చీమల దాడులకు ప్రజలు నానా అవస్థలు పడ్డారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో జరిగింది. చీమల దండయాత్రతో ఆమదాలవలస మండలం ఇసుకలపేట గ్రామస్తులు అష్టకష్టాలు పడ్డారు. ఎర్ర చీమలు ఇండ్లలోకి చొరబడి జనాలకు చికాకు తెప్పించాయి. వీటి బాధ పడలేక చివరికి తమ గ్రామాలు వదిలి వేరే ఊళ్లకు వలస వెళ్లారు. ఇలాంటి పరిస్థితి ఓ గ్రామంలో చోటు చేసుకుంది.. కాకపోతే చీమల వల్ల కాదు.. ఈగల వల్ల. అవును ఈగలు ఓ గ్రామ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..
తెలుగు ఇండస్ట్రీలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ‘ఈగ’. ఈ మూవీలో నాని చనిపోయి ఈగ రూపంలో పుడతాడు.. గత జన్మలో తనను చంపిన విలన్ సుదీప్ పై పగబట్టి అతన్ని నానా హింసలు పెడతాడు. చూడటానికి చిన్న జీవి అయినా ఈగ పెట్టే బాధలు పడలేక విలన్ సుదీప్ పిచ్చెక్కిపోతాడు. ఈ సీన్లు చూస్తుంటే నిజంగా ఫుల్ ఎంజాయ్ చేస్తాం. అయితే రీల్ లైఫ్ లోనే అనుకుంటే రియల్ లైఫ్ లో కూడా ఈగలు యూత్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఓ ఊరిలో ఈగల కారణంగా యువతకు పెళ్లిళ్లు కావడం లేదంటే నమ్ముతారా? ఇది ముమ్ముటికి నిజం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నావ్ జిల్లాలో రుద్వార్ అనే గ్రామంలో ఈగల దండయాత్ర కొనసాగుతుంది.
రుద్వార్ అనే గ్రామంలో కొంత కాలంగా ఈగల దండయాత్ర కొనసాగుతుంది. గ్రామంలోని ప్రతి ఇంట్లో ఈగల వస్తువులపై ప్రతిచోట కనిపిస్తాయి. చుట్టూ ఈగలు చప్పుడు చేస్తూ ఎగురుతుంటే గ్రామ ప్రజలు ఆందోళ చెందుతున్నారు. ఇండ్లలో ఆహార పదార్థాలు, పానియాల్లో ఈగలు కనిపించడంతో ఒక్కోసారి తినాలన్నా.. తాగాలన్న భయపడుతున్నారు. ఒకరకంగా చెప్పాంటే గ్రామస్థులకు ఈగలు చూసి కంటిమీద కునుకు లేకుండా పోయిందనే చెప్పొచ్చు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ఈగల బాధ మరింత పెరిగిపోయిందని ఆవేదన చెందుతున్నారు. ఎంత దారుణం అంటే ఈగల కారణంగా గ్రామంలో యువకులకు పెళ్లిళ్లు కూడా కావడం లేదు. తమ కూతురిని ఆ ఊరి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడాని యువతి తల్లిదండ్రులు విముఖత చూపిస్తున్నారు. కొంతమంది యువతులు తమ భర్తలకు విడాకులు ఇచ్చి మరీ తమ సొంతఊరికి వెళ్లిపోతామని అంటున్నారు.
స్థానికుల ఇళ్లకు చుట్టాలు కూడా ఎవరు రావడం లేదు. ఎన్ని పురుగులు మందులు, కెమికల్స్ ఉపయోగించిన ఈగలను మాత్రం తరిమికొట్లలేకపోతున్నారు. ఈగలు ఇంతగా ప్రబలిపోవడానికి గల కారణం.. రోజు రోజుకీ ఆ గ్రామం చుట్టుపక్కల పెరుగుతున్న పౌల్ట్రీ ఫాం వ్యాపారమే. ఇటీవల కొంతమంది వ్యాపారులు అక్కడ కోళ్ల పెంపకం ప్రారంభించారు. ఈ వ్యాపారంలో చాలా మంచి లాభాలు వచ్చాయి. ఇంకేముంది అందరూ పౌల్ట్రీ ఫాం వ్యాపారంపై మొగ్గు చూపడంతో కొంతకాలంగా చుట్టుపక్కల అపరిశుభ్రత, దుర్వాసన పెరిగి ఈగలు వస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు.