వాళ్లంతా పసుపు-కుంకుమలకు దూరమైన వితంతువులు. తెల్ల చీర కట్టుకుని, జీవితంలో రంగులు లేకుండా బతుకుతుంటారు. అలాంటి వాళ్ల జీవితాల్లో రంగులు నింపింది హోలీ. వసంతాలు వెలిసిపోయిన వారి జీవితాల్లో మళ్లీ రంగులు పూయించింది. మోడు వారిన వింతువుల జీవితాల్లో వసంత కేళి ఆనందోత్సాహాలు నింపింది. దాదాపు వెయ్యి మంది వితంతువులు హోలీ ఆడుతూ మళ్లీ రంగుల లోకంలో విహరించారు. ఎక్కడ, ఏంటి? అనుకుంటున్నారా? మరి.. ఆ వివరాలేంటో తెలుసుకుందాం పదండి..
ఉత్తరప్రదేశ్ లోని మధురలో ఈ అపూర్వ ఘట్టం జరిగింది. మీరా సహభాగిని ఆశ్రమం వేదికగా నిలిచింది. కృష్ణుడి భక్తులు, పర్యాటకుల సమక్షంలో ఒకరిపై ఒకరు రకరకాల రంగులు చల్లుకుంటూ వసంత కేళి ఆడారు. తెల్లచీరలు కట్టుకున్న వితంతువులు నామాలు పెట్టుకుని ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందంగా హోలీ ఆడుకున్నారు. నృత్యాలు చేస్తూ.. చిన్న పిల్లలాగా మారి ఆనందంగా గడిపారు. శతాబ్దాల తరబడి కొనసాగుతున్న మతపరమైన కట్టుబాట్లను ఛేదించి, వేలాదిమంది వితంతువులు ఈ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. దీనికోసం దాదాపు 500 కిలోల రంగులు ఉపయోగించారు.
మహిళల సాధికారత కోసం కృషి చేస్తున్న సులభ్ ఇంటర్నేషనల్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు2014 నుంచి ఈ హోలీ వేడుకలు నిర్వహిస్తున్నారు. చేసింది. దేశంలోని చాలాచోట్ల వితంతువులు గుళ్లలోకి రావడం, హోలీ ఆడుకోవడం లాంటివి నిషేధం. కానీ, బృందావనంలో ఇందుకు విరుద్ధంగా తమను ఆలయంలోకి అనుమతించి, హోలీ వేడుకల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించడం పట్ల వితంతువులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల తరబడి కుటుంబ సభ్యులకు దూరంగా ఒంటరి జీవితం అనుభవిస్తున్న వృద్ధ మహిళలను జనజీవన స్రవంతిలో కలిపేందుకు బృందావనంలో ఈ హోలీ సంబరాలను “సులభ్” సంస్థ ప్రారంభించింది. మరి.. ఈ వితంతువుల హోలీ పండుగ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.