ప్రపంచంలో అత్యంత రద్దీగల ప్రయాణ మార్గం రైల్వే మార్గం. రైలు మార్గాలు దేశంలోని నలు మూలలకు విస్తరించి ఉన్నాయి. ప్రపంచంలో అత్యధిక ఉద్యోగులు గల వ్యవస్థ భారతీయ రైల్వే వ్యవస్థ. రైల్వేలోని అత్యంత మురికిగా ఉన్న రైళ్ల జాబితాలో ‘సహర్స-అమృతసర్ గరీబ్ రథ్’ ట్రైన్ పేరు మొదటి స్థానంలో ఉంది. ఈ ట్రైన్ పంజాబ్ నుండి సహర్సా వరకు నడుస్తుంది.
ప్రపంచంలో అత్యంత రద్దీగల ప్రయాణ మార్గం రైల్వే మార్గం. రైలు మార్గాలు దేశంలోని నలు మూలలకు విస్తరించి ఉన్నాయి. ప్రపంచంలో అత్యధిక ఉద్యోగులు గల వ్యవస్థ భారతీయ రైల్వే వ్యవస్థ. దూర ప్రయాణాలకు ప్రజలు అత్యధికంగా రైలు రవాణానే ఎంచుకుంటారు. నిత్యం దేశ వ్యాప్తంగా వందలాది ట్రైన్లు ప్రజలకు సర్వీసులు అందిస్తూనే ఉంటాయి. ఈ రైళ్లు భారతీయ రైల్వే ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. భారతీయ రైల్వే సంస్థ కూడా చాలా పరిశ్రమిస్తుంది. రైళ్లను నిత్యం క్లీన్ గా ఉంచడానికి తగిన చర్యలు తీసుకుంటూనే ఉంటారు. అయినా కొన్ని ట్రైన్లు మాత్రం చాలా డర్టీగా ఉంటాయి. మురికిగా ఉన్న రైళ్లలో అత్యంత కంపుకొడుతున్న రైళ్లు దేశ వ్యాప్తంగా 10 ఉన్నాయి. ఈ రైళ్ల గురించి చాలా ఫిర్యాదులు అందుతాయి. అవి ఏ ట్రైన్లు వాటి వివరాలు తెలుసుకుందాం..
రైల్వేలోని అత్యంత మురికిగా ఉన్న రైళ్ల జాబితాలో ‘సహర్స-అమృతసర్ గరీబ్ రథ్’ ట్రైన్ పేరు మొదటి స్థానంలో ఉంది. ఈ ట్రైన్ పంజాబ్ నుండి సహర్సా వరకు నడుస్తుంది. ఇప్పటి వరకు ఈ ట్రైన్ లో అపరిశుభ్రతపై ఫిర్యాదులు ఎక్కువగా వస్తుంటాయి. ఈ ట్రైన్ కోచ్ నుండి సింక్, టాయిలెట్ సీట్, క్యాబిన్ వరకు అన్ని మురికిగానే కనిపిస్తుంది. అందుకే ఈ ట్రైన్ అపరిశుభ్రత రైళ్లలో ప్రథమ స్థానంలో ఉంది.
ఈ ట్రైన్ కాకుండా అపరిశుభ్రతతో నిండినవి దేశ వ్యాప్తంగా అనేక రైళ్లు ఉన్నాయి. ‘జోగ్బానీ-ఆనంద్ విహార్ సీమాంచల్’ ఎక్స్ప్రెస్, ‘శ్రీ మాతా వైష్టో దేవి – బాంద్రా స్వరాజ్’ఎక్స్ప్రెస్ రైలు, ఫిరోజ్పూర్-అగర్తలా ‘త్రిపుర సుందరి’ ఎక్స్ప్రెస్ రైలుతో సహా కొన్ని ఇతర రైళ్ల పేర్లు కూడా అపరిశుభ్రత జాబితాలో ముందువరుసలో ఉన్నాయి. వీటితో పాటు ‘ఆనంద్ విహార్-జోగ్బానీ సీమాంచల్’ ఎక్స్ప్రెస్, అమృత్సర్ క్లోన్ స్పెషల్ ట్రైన్, అజ్మీర్-జమ్ము తావిపూజ ఎక్స్ప్రెస్, న్యూఢిల్లీ-దిబ్రూగఢ్ రాజధాని ఎక్స్ప్రెస్పై కూడా అపరిశుభ్రతపై 1000కి పైగా ఫిర్యాదులు చేరాయి. దేశ వ్యాప్తంగా మురికి రైళ్ల జాబితాలో మొదటి 7 రైళ్లు ఉత్తర భారతదేశంలో.. మిగతా రైళ్లు తూర్పు భారతదేశానికి వెళ్లే రైళ్లపై ఫిర్యాదులు వచ్చాయి. రైళ్లను పరిశుభ్రంగా ఉంచేందుకు ఇప్పుడు రైళ్లలో ఆన్బోర్డ్ హౌస్ కీపింగ్ సేవలను ప్రారంభించినట్లు రైల్వే అధికారులు తెలుపుతున్నారు.