‘పుర్రె కో బుద్ది .. జిహ్వా కో రుచి’ అని పెద్దలు ఊరికే అన్నలేదు. సమాజంలో కొందరు వ్యక్తులు చేసి వింత ప్రవర్తన కారణంగానే ఈ సామెత వాడుకలోకి వచ్చింది. కొందరు బ్రతికుండగానే తమ సమాధులు తామే నిర్మించుకోవడం చూశాం. అంతే కాక బ్రతికుండగానే సమాధి అవ్వండ వంటి వార్తలు విన్నాము. అలానే సాధారణంగా తండ్రి చనిపోతే కొడుకులు ఆయను తద్దినం పెడతారు. అయితే తాజాగా ఓ వ్యక్తి అంతకు మించి చేశాడు. ఓ 70 ఏళ్ల పెద్దాయన తన తద్దినం తానే పెట్టుకున్నాడు. ఎందుకు ఇలా చేశావు అని అడిగిన కొడుకులుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు ఆ కురు వృద్ధుడు. ఈ ఘటన బీహార్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి
బీహార్ లోని ముజఫర్ జిల్లా సక్రా బ్లాక్ లోని భారతీపూర్ అనే గ్రామంలో హరిచంద్ర దాస్ అనే 75 ఏళ్ల వృద్దుడు కొడుకులతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. హరిచంద్ర చేసిన ఓ పని ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఏడాది క్రితం బతికి ఉండగానే తన దశదినక్మరను హరి చంద్ర చేసుకున్నాడు. అప్పట్లో హరిచంద్ర చేసిన పని కుటుంబ సభ్యులతో పాటు స్ధానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. మొదట తన దిన కర్మను చేయమని కుటుంబ సభ్యులను కోరాడు. అయితే వారు దానికి అంగీకరించలేదు. అలా చేయొద్దని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హరి చంద్రదాస్ కి సూచించారు. అయితే ఆ వృద్ధుడు మక్కు పట్టు పట్టుకుని కూర్చున్నాడు. తన దినకర్మ చేయాల్సిందేనని భీష్మించుకుని ఉన్నాడు. దీంతో చేసేదేమీలేక కుటుంబ సభ్యులు ఆయన దిన కర్మను చేసేందుకు అంగీకరించారు. అలా గతేడాది హరిచంద్ర దాస్ తన దినకర్మను ఘనంగా జరుపుకున్నాడు.
తాజాగా అతడు తనకు తద్దినం పెట్టుకున్నాడు. అది కూడా పూర్తి ఆచార వ్యవహారాలతో జరుపుకొన్నాడు. తద్దిన కార్యక్రమం అనంతరం గ్రామస్థులకు విందు కూడా ఏర్పాటు చేశాడు. ఈ విషయంపై హరిచంద్ర దాస్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. నేటి కాలంలో కొందరు కొడుకులు ఆస్తులకే వారసులమని తమ తల్లిదండ్రుల బరువు, బాధ్యతలకు కాదన్న విధంగా ప్రవర్తిస్తున్నారని, తన కొడుకులు ఇద్దరూ కూడా అలానే ఉంటారేమోనని, తనకు తద్దినం సరిగ్గా పెడతారో? లేదో? అన్న సందేహం వచ్చిందని ఆయన తెలిపారు. చనిపోయిన తరువాత ఎలాఉంటుందో తెలియదు అందుకే తన ఆబ్దీకాన్ని తానే పెట్టుకోవాలని నిశ్చయించుకున్నట్లు హరిచంద్ర దాస్ పేర్కొన్నారు. ఈ కాలం కొడుకులపై నమ్మకం లేని తల్లిదండ్రులు చివరకు చనిపోయిన తర్వాత చేయాల్సిన కర్మను కూడా బతికుండగానే వారే చేసుకుంటున్నారు.