భారత్, పాకిస్తాన్.. ఈ రెండు దేశాలకు సంబంధించిన ఏ విషయమైనా సరే చాలా సున్నితమైనవి. ఏ మాత్రం తేడా వచ్చినా అంతే సంగతి. అలాంటిది.. భారత్లో ‘పాకిస్తాన్ జిందాబాద్’.. అంటూ స్లోగన్స్తో ఉన్న పాటను వింటుంటే మాములు విషయమా. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలో సింఘై కలాన్ గ్రామంలో ఓ దుకాణదారుడు తన షాపులో ‘పాకిస్తాన్ జిందాబాద్’ పాట ప్లే చేశాడు. దీని అక్కడున్న స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను చూసిన బీజేపీ నేతలు భూటా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసుర్ నమోదు చేశారు. కేసులో భాగంగా నిందితులను విచారిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామని బరేలీ (రూరల్) ఎస్పీ రాజ్కుమార్ అగర్వాల్ వెల్లడించారు.
For merely playing alleged #Pakistan Zindabad song, yesterday #Bareilly police lodged FIR after the video turned up online.
Incident of Singhai Murawan village of Bhuta police limits.#UttarPradesh pic.twitter.com/lVO7lEHiG7
— Arvind Chauhan अरविंद चौहान (@Arv_Ind_Chauhan) April 14, 2022
ఈ ఘటన అనంతరం నిందితుడి తల్లి మాట్లాడుతూ.. “ఏం జరిగిందో మాకు తెలియదు. నా చిన్న కొడుకు తన మొబైల్ ఫోన్లో మతపరమైన పాటలు విన్నాడని చెబుతున్నారు. అతను చదువుకోలేదు. ఫోన్లో అలాంటి నినాదాలు ఉన్నాయని అతనికి తెలియదు. దయచేసి నా కొడుకును విడుదల చేయండి’’ అని పోలీసులను వేడుకుంది.
ఇది కూడా చదవండి: 3 అడుగులే ఉన్నాడని ఎవరూ జాబు ఇవ్వలేదు.. ఇప్పుడు ఏకంగా 40 ఆఫర్లు!