మహిళలే కాదు మేము కూడా గృహ హింసకు పాల్పడుతున్నాము, మా గోడు వినేందుకు, మా సమస్యలు పరిష్కరించేందుకు జాతీయ కమిషన్ ఫర్ మెన్ ను ఏర్పాటు చేయాలని ఓ న్యాయవాది సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీం కోర్టు స్పందించింది.
సొసైటీలో మహిళలపై దాడులు, అఘాయిత్యాలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. మహిళలు, యువతులపై జరిగే దారుణాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికి వారిపై జరిగే దాడులను నిలువరించలేక పోతున్నారు. ఈ క్రమంలోనే ఇండియన్ గవర్నమెంట్ మహిళల రక్షణార్థం జాతీయ మహిళా కమిషన్ ను ఏర్పాటు చేశాయి. ఈ మహిళా కమిషన్ మహిళల రక్షణ కోసం అమల్లో ఉన్న చట్టాలను సమీక్షించి, అవసరమైతే వాటికి సవరణలు చేసి మహిళల రక్షణ కోసం పాటుపడుతుంది. ఇదిలా ఉంటే ఇటీవల పురుషులకూ జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలంటూ ఓ వ్యక్తి సుప్రీం కోర్టు ను ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్ పై సుప్రీం కోర్టు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ప్రేమ, పెళ్లి పేరుతో మోసాల భారిన పడుతున్న యువతుకు అండగా మహిళా కమిషన్ ఉంటుంది. మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా, వారి పరువుకు భంగం కలిగించే వారిపై మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసి విచారణ చేపడుతుంది. గృహ హింసకు గురవుతున్న మహిళలకు అండగా నిలిచి, మహిళల శ్రేయస్సుకు అనుగుణంగా పనిచేస్తుంది. కాగా మహిళలకు ఎలాగైతే జాతీయ మహిళా కమిషన్ ఉందో, తమకు కూడా తమ బాధలను, తమ వేధనలను చెప్పుకోవడానికి పురుషులకు కూడా జాతీయ కమిషన్ ఫర్ మెన్ ను ఏర్పాటు చేయాలని న్యాయవాది మహేష్ కుమార్ తివారీ పిటిషన్ దాఖలు చేశారు. పురుషులు కూడా గృహ హింసకు గురువుతున్నారని, కుటుంబ సమస్యలతో సతమతమై తనువు చాలిస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నాడు.
వివాహిత పురుషులే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపాడు. బలవన్మరణాలకు పాల్పడుతున్న పురుషుల కేసులపై విచారణకు గైడ్ లైన్స్ రూపొందించాలని పిటిషనర్ కోరాడు. కాగా ఈ పిల్ ను జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సూర్యకాంత్ తో కూడిన ధర్మాసనం పరిగణనలోకి తీసుకోవడానికి నిరాకరించింది. మీరు నాణేనికి ఒక వైపునే చూపించాలనుకుంటున్నారా? పెళ్లైన తర్వాత చనిపోతున్న యువతుల వివరాలను మీరు ఇవ్వగలరా? చనిపోవాలని ఎవ్వరూ అనుకోరు, అది వారి వ్యక్తి గత కారణాలపై ఆధారపడి ఉంటుందని సుప్రీం వెల్లడించింది. పిల్ వెనక్కి తీసుకునేందుకు పిటిషనర్ కు సుప్రీం కోర్టు అవకాశం ఇచ్చింది.