ఇంట్లోనుంచి బయటకు అడుగు పెట్టింది మొదలు తిరిగి ఇల్లు చేరేది నమ్మకం లేకుండా పోయింది. వాహనంపై బయలుదేరితే ఈ నమ్మకం మరింత సన్నగిల్లుతోంది. ఈ నేపథ్యంలో రహదారి భద్రతకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఉత్తర భారతదేశాన్ని అతలాకుతలం ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్లో కుండపోత వానలతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడటంతో జాతీయ రహదారి 707 తెగిపోయింది.
ఈ సంఘటన రాష్ట్రంలోని సిర్మౌర్ జిల్లాలోని మారుమూల షిలై ఉపవిభాగంలోని కాళి ధంక్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఇక్కడ రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సిర్మూర్లోని పాటా సాహిబ్ సిమ్లాలోని హట్కోటికి కలిపే నేషనల్ హైవే 707 మార్గం ఒక్కసారిగా లోయలోకి జారి పడిపోయిది. దీంతో ఆ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచింది. ప్రజలు వేరే మార్గాల ద్వారా వెళ్లాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది.
కొండచరియలు విరిగిపడుతున్న భయంకర దృష్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దీనిని చూసిన నెటిజన్లు షాక్కు గురవుతున్నారు. ఈ వీడియోలో కొండపై భాగం పడిపోతున్నట్లు కనిపిస్తుంది. దానితోపాటు రోడ్డు కూడా కుప్పకూలిపోయింది. దాదాపు 100 మీటర్ల రోడ్డు క్షణాల్లో జారి కిందకు పడిపోయింది.
#HimachalPradesh: Highway along Paonta-Shillai stretch blocked near Barwas due to a #landslide in Sirmaur district.
No loss of life reported. pic.twitter.com/aSOSZ8mPzG
— TOIChandigarh (@TOIChandigarh) July 30, 2021