మనిషికి జైలు జీవితం అంటే ఎంత కష్టంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. సాధారణంగా జైల్లో ఉన్నఖైదీలకు బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు ఉండవు. కొంది జైల్లో ఖైదీలు చాలా సీక్రెట్ గా సెల్ ఫోన్లు దాచుకుంటారు.
సాధారణంగా జైలు జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందని అంటుంటారు.. జైల్లో ఉన్నఖైదీలకు బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు ఉండవు. జైలు ఖైదీలకు సెల్ ఫోన్ అనుమతి ఉండదు. కాకపోతే కొంత మంది ఖైదీలు జైలు అధికారుల అండతో సెల్ ఫోన్ ని భద్రపర్చుకొని తమ కుటుంబ సభ్యులతో మాట్లాడటం.. కొంతమంది జైల్లో ఉంటూనే దందాలు చేయడం కూడా చూస్తుంటాం. ఒక వీఐపీ ఖైదీలకు రాచమర్యాదలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రతేకంగా చెప్పనక్కరలేదు. సొంత ఇంట్లో ఉండే అన్ని సౌకర్యాలు ఉంటాయని అంటుంటారు. కొంతమంది ఖైదీలకు పోలీసులకు తెలియకుండా రహస్యంగా సెల్ ఫోన్ దాచుకోవడం.. అధికారులు తనిఖీలు చేపట్టినపుడు దొరికిపోవడం సర్వసాధారణం. ఓ జైల్లో ఖైదీ అధికారులు వస్తున్నారని భయంతో తన వద్ద ఉన్న సెల్ ఫోన్ గుటుక్కున మింగేశాడు. ఈ ఘలన బీహార్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే..
బీహార్ లోని గోపాల్ గంజ్ డివిజన్ జైలు లో అధికారులు శనివారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో జైలులో ఓ విచిత్ర సంఘటన జరిగింది. డ్రగ్స్ అక్రమరవాణా కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైసర్ అలీ అనే ఖైది అధికారులు తనిఖీలు చేస్తున్నారని తెలుసుకొని తన వద్ద సీక్రెట్ గా దాచుకున్న ఒక సెల్ ఫోన్ ని మింగేశాడు. అధికారులు అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత ఖైసర్ అలీ కి కడుపునొప్పితో మెలికలు తిరాడు.. అది గమనించిన పోలీస్ హుటాహుటిన ఆస్పత్రికి తరలించడంతో ఎక్స్ రే తీసిన డాక్టర్లు ఖంగుతిన్నారు. అతని కడుపులో ఓ సెల్ ఫోన్ ఉండటం చూసి ఆశ్చర్యపోయారు.
2020 లో హజియాపూర్ గ్రామ సమీపంలో డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో ఖైసర్ అలీ పోలీసులకు పట్టుబడటంతో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నేరం రుజు కావడంతో అతనికి కోర్టు జైలు శిక్ష విధించింది. అప్పటి నుంచి బీహార్ లోని గోపాల్ గంజ్ డివిజన్ జైల్లో ఖైసర్ అలీ శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ ఘటన తర్వాత గోపాల్గంజ్ డివిజన్ జైల్లో భద్రత వ్యవస్థ మరింత పటిష్టం చేశారు. గతంలో ఖైసర్ అలీ ఎన్నో పర్యాయాలు జైలుకు వచ్చాడు.. కానీ ఎప్పుడూ ఇలాంటి అఘాయిత్యానికి పాల్పపడలేదని పోలీసులు తెలిపారు. మొత్తానికి ఖైసర్ అలీకి మెరుగైన వైద్యం అందించి మొబైల్ ఫోన్ ని బయటకు తీశారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.