జిల్లా కోర్టులోనే న్యాయవాదిని తుపాకీతో కాల్చి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్ జిల్లా కోర్టులో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. లాయర్ భూపేంద్ర సింగ్ కోర్టు కాంప్లెక్స్లోని మూడో అంతస్తులో కొందరితో మాట్లాడుతుండగా తుపాకీ కాల్పుల శబ్దం వినిపించినట్లు పక్క బ్లాక్లో ఉన్న న్యాయవాదులు తెలిపారు. అనంతరం అక్కడికి వెళ్లి చూడగా.. భూపేంద్ర సింగ్ రక్తం మడుగులో కిందపడి చనిపోయి ఉన్నాడని పోలీసులు తెలిపారు. మృతదేహం సమీపంలో నాటు తుపాకీని పోలీసులు గుర్తించారు. న్యాయవాది హత్యకు కారణం ఏమిటో తెలియలేదని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై పలువురి నుంచి వివరాలు సేకరించామని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.