అక్కడ అర్ధాత్రి శ్మశానంలో సమాధుల నుంచి శవాలు మాయమవుతున్నాయి. వినటానికి భయంకరంగా ఉన్నా ఇది నిజమేనని స్థానికులతో పాటు పోలీసులు కూడా చెబుతున్నారు. అసలు సమాధుల నుంచి శవాలు తవ్వి ఎవరు తీసుకెళ్తున్నారు? తీసుకెళ్లిన డెడ్ బాడీలను ఏం చేస్తాన్నారనే దానిపై పోలీసులు కూడా విచారణ చేపడుతున్నారు. అసలు ఈ భయంకరమైన ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.
ఇది కూడా చదవండి: విర్రవీగిన 60 ఏళ్ల వృద్ధుడు.. ఒంటరిగా ఉన్న బాలుడిని ఏం చేశాడో తెలుసా?
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బీహార్లోని సుపాల్ పట్టణలో బాగ్లా నది ఒడ్డున ఓ శ్మశాన వాటిక ఉంది. స్థానికంగా ఎవరైనా చనిపోయినా వారిని ఇక్కడే సమాధి చేస్తూ ఉంటారు. కానీ కొన్నిచోట్ల సమాధులు తవ్వి ఉన్న ఆనవాళ్లు కనిపించాయి. దగ్గరికి వెళ్లి చూస్తే.. అందులో ఉన్న మృతదేహాలు మాయమయ్యాయి. ఈ విషయం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవ్వడంతో పోలీసులు వచ్చి పరిశీలించారు. అక్కడ ఖననం చేసిన మృతదేహాలు ఎవరివి? ఎందుకు అలా తవ్వి తీసుకెళ్తున్నారనే దానిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆరా తీస్తున్నారు.
ఐతే అక్కడ ముగ్గురు చిన్నారులను ఇటీవలే పూడ్చిపెట్టినట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. వారి శవాలు ఇప్పుడు కనిపించడంలేదు. గుర్తు తెలియని వ్యక్తులు సమాధులను తవ్వి డెడ్బాడీలను ఎత్తుకెళ్లారు. దీనిపై పోలీసులు సీరియస్ గా డీల్ చేస్తున్నారు. దీంతో ఆ శ్మశాన వాటిక కాపలాగగా కొంతమంది వాచ్ మెన్ లను కూడా ఉంచారట. ఇలాంటివి గతంలో కూడా చాలా జరిగాయని స్థానికులు వాపోతున్నారు. దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.