ప్రతి ఒక్కరు బంగారంపై ఆసక్తి చూపిస్తుంటారు. అయితే బంగారం, వజ్రాల వంటి వాటితో తయారు చేసే వస్తువులను కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తుంటారు. కస్టమర్ల ఆలోచనలకు, అభిరుచులకు తగినట్లు ఎప్పటికప్పుడు జ్యువెలరీ సంస్థలు కూడా ప్రత్యేక డిజైన్లు తయారు చేస్తుంటాయి. అయితే ఇలా తయారు చేసే వస్తువుల్లో కొన్ని ఆద్భుతంగా ఉంటాయి. అంతేకాక జ్యువెలరీ సంస్థ వాళ్లు తయారు చేసే కొన్ని రకాల బంగారు, వజ్రాల వస్తువులు అందర్ని ఆకట్టుకుంటాయి. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఓ జ్యువెలరీ సంస్థ.. ప్రపంచంలోనే ఎక్కువ వజ్రాలు పొదిగిన రింగ్ ను తయారు చేసింది. ఈ ప్రత్యేక ఉంగరం చూపరులను ఆకట్టుకుంటోంది. దాదాపు 26 వేల వజ్రాలతో ఆ మహా ఉంగరాన్ని తయారు చేశారు. మరి.. ఎందుకు తయారు చేశారు. ఆ ఉంగరం తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టిందో.. ఇప్పుడు తెలుసుకుందాం..
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని మేరఠ్ లో డాజ్లింగ్ జ్యువెలరీ అనే ఆభరణాల తయారీ సంస్థ ఉంది. మేరఠ ప్రాంతంలో ఆ జ్యువెలరీ సంస్థకు మంచి పేరు ఉంది. ముఖ్యంగా వెరైటీ డిజైన్లకు ఈ జ్యువెలరీ పెట్టింది పేరు. తాజాగా 26,200 వజ్రాలను ఉపయోగించి ఓ రింగ్ ను డిజైన్ చేసింది. ఆ మహా ఉంగరానికి దేవ్ ముద్రిక అని పేరు కూడా పెట్టారు. ఈ 26 వేలతో రూపొందించిబడిన ఈ ప్రత్యేక ఉంగరం చూపరులను ఆకట్టుకుంది. గతంలో దక్షిణాదికి చెందిన ఓ సంస్థ 24 వేలు వజ్రాలు పొదిగిన ఉంగరాన్ని తయారు చేసిందని డాజ్లింగ్ సంస్థ యజమాని విపుల్ అగర్వాల్ తెలిపారు. వారి రికార్డును ప్రస్తుతం తాము బద్దలు కొట్టామని ఆయన తెలిపారు. ఈ ఉంగరం తయారిలో భాగంగా మొదటి డిజైన్ ను సాఫ్ట్ వేర్ ద్వారా రూపొందించి.. అనంతరం కళాకారులతో రింగ్ ను తయారు చేయించినట్లు విపుల్ వివరించారు.
ఇంకా విపుల్ అగర్వాల్ మాట్లాడుతూ..” ఈ వజ్రపు రింగ్ ను పుష్పం ఆకారంలో తయారు చేశామని, దీనిని రెండు వేళ్లకు పెట్టుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ ఉంగరం తయారీ కోసం దాదాపు 10 మంది కళాకారులు మూడు నెలలపాటు రేయింబవళ్లు కష్టపడి రూపొందినట్లు ఆయన తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా ఒక రింగ్ తయారీకి ఈ స్థాయిలో వజ్రాలను వాడలేదని విపుల్ తెలిపారు. ప్రస్తుతం ఈ ఉంగరం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఉంగరం వేల కోట్లు ఉండొచ్చని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతానికి ఈ మహా ఉంగరం ధరను యజమానులు గోప్యంగా ఉంచారు. మరీ.. ఈ ప్రత్యేకమైన మహా ఉంగరం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.