బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తరుచు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. అయితే తాజాగా కంగనా చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి తాజాగా కంగనా రనౌత్.. భారతదేశానికి 1947లో వచ్చింది నిజమైన స్వాతంత్ర్యం కాదని… అది ఒక భిక్ష మాత్రమే. 2014 తర్వాతే ఇండియాకు అసలైన స్వాతంత్ర్యం వచ్చిందంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. కంగనా చేసిన ఇలాంటి వ్యాఖ్యలపై రాజకీయ నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు.
అయితే తాజాగా సీపీఐ నేత నారాయణ సైతం స్పందించి కంగనాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మోదీ వచ్చాకే స్వాతంత్ర్యం వచ్చిందనే వ్యాఖ్యలు ఆమె బానిస మనస్తత్వాన్ని సూచిస్తుందని అన్నారు. ఇక దేశ స్వాతంత్ర్యం గురించి మాట్లాడే నైతిక హక్కు ఆమె కోల్పోయారంటూ నారాయణ ఫైర్ అయ్యారు. కంగనా ఒక అత్యంత విలాసవంతమైన బిచ్చగత్తె అని ఆమెకు పద్మ శ్రీ అవార్డు ఎలా వచ్చిందో అందరికీ తెలుసునని నారాయణ అన్నారు. ఇదిలా ఉంటే దేశ స్వాతంత్ర్యంపై కంగనా చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇక కంగనాపై సీపీఐ నారాయణ చేసిన వ్యాఖ్యల పట్ల మీరు ఏకీభవిస్తున్నారా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.