ఒక ముఖ్యమంత్రి అయి ఉండి సామాన్య ప్రజల ఆచార, సంప్రదాయలను గౌరవించారు. కార్యక్రమంలో ఉన్న పద్ధతులను పాటించి అక్కడి భక్తులను ఆనంద పరిచారు. ఏకంగా కొరడా దెబ్బలు రుచిచూసి జనంలో ఒకడిగా నిలిచారు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్. శుక్రవారం దుర్గ్ జిల్లా జంజిగిరి గ్రామంలో జరిగిన గోవర్థన పూజకు సీఎం హాజరయ్యారు. కొరడాతో కొట్టించుకునే సంప్రదాయ కార్యక్రమం ‘సొంటా’లో పాల్గొన్నారు. కొరడాతో తన చేతిపై కొట్టించుకుని తన భక్తిని చాటుకున్నారు. కాగా తన రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి ఆ దైవాన్ని కోరుకున్నట్లు సీఎం పేర్కొన్నారు. కొరడాతో ఇలా కొట్టించుకుంటే ఎంతటి కష్టం అయినే తట్టుకునే సహనం తమకు వస్తుందని అక్కడి స్థానికుల నమ్మకం. అందుకే ఈ పూజా కార్యక్రమానికి వచ్చిన భక్తులు కొరడాతో కొట్టించుకుంటారు.
प्रदेश की मंगल कामना और शुभ हेतु आज जंजगिरी में सोटा प्रहार सहने की परंपरा निभाई।
सभी विघ्नों का नाश हो। pic.twitter.com/bHQNFIFzGv
— Bhupesh Baghel (@bhupeshbaghel) November 5, 2021